Kangana: ప్రస్తతం బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్గా హాట్టాపిక్లో నలుస్తోంది కంగనా రనౌత్. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా.. ఆ తర్వాత స్వాతంత్య్రంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. దేశానికి 2014లో మోదీ ప్రభుత్వంతో స్వాతంత్య్రం వచ్చిందంటూ.. బ్రిటిష్ వారు పెట్టింది భిక్ష అని వ్యాఖ్యానించింది. దీంతో కంగనాపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలోనే పలు చోట్ల కంగనాపై కేసులు కూడా నమోదయ్యాయి.

Also Read: ఈ హీరోయిన్ల రియల్ ఫేస్ లుచూస్తే కిందపడిపోతారు..!
కాగా, ఈ వివాదం సర్దుమనగకముందే.. తాజాగా కంగనా చేసినవ్యాఖ్యలపై సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా స్పందించారు. కంగనా వ్యాఖ్యలు చిన్నపిల్లల చేష్టల్లగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అటువంటి చర్య అజ్ఞానాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. కంగనాపై పద్మశ్రీ దుష్ప్రభావం చూపిందిందా ఏంటి?.. అని ఆయన ప్రశ్నించారు.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ముఖేశ్. అందలో కంగనా ఫొటోను షేర్ చేస్తూ.. దేశ స్వాతంత్య్రంపై మీరు చేసిన వ్యాక్యలు చాలా హాసాస్పదం. అసలు ఇది నీ అజ్ఞానానికి నిదర్సనమా.. లేక పద్మ శ్రీ అవార్డు ప్రభావమో తెలియట్లేదని అన్నారు. కాగా, ఇటీవలే వ్యవసాయ చట్టాల బిల్లు రద్దుపైనా కంగనా తనదైశ స్టైల్లో ట్వీట్ చేసింది. ఇది ఒక పిరికిపంద చర్యగా పేర్కొంటూ మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ఇకపై దేశంలో జిహాదీలతో నిండిపోతుందని పేర్కొంది.
Also Read: నయా ట్రెండ్ సెట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మలు!