Mukkamala Krishnamurthy: ‘ముక్కామల’.. తెలుగు తెరకు కళ్ళల్లోనే విలనిజాన్ని చూపించిన మొదటి తరం విలన్. నిజానికి హీరోగా సినీరంగంలో కాలు పెట్టి.. ఆహార్యంలో క్రౌర్యం పాలు కాస్త మోతాదుకు మించి ఉండటంతో.. ‘ముక్కామల’ విలన్ గా మారాల్సి వచ్చింది. ఆ తరువాత విలనిజం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించి భేష్ అనిపించుకున్నారు. 1945 లో ‘మాయా మచ్ఛీంద్ర’ చిత్రంలో అనుకోని పరిస్థితుల్లో ఓ కీలక పాత్రలో నటించారు. నాటి నుంచి 1987లో తుది శ్వాస విడిచే వరకు సుమారు మూడు వందల చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించారు ‘ముక్కామల’.
ఆయన అసలు పేరు ముక్కామల కృష్ణమూర్తి. ఆయనే మొట్టమొదటి సారిగా ఎన్టీఆర్ గారికి చుట్ట తాగడం అలవాటు చేసింది. ముక్కామల గారు 1920లో గుంటూరులో పుట్టారు. ఆయన తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఎ.సి.కాలేజీలో. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ అదే కాలేజీలో బీఏ చదువుతున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్, ముక్కామల, జగ్గయ్య కలిసి నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారితో ఓ సారి.. ‘నీ గాత్రంలో బేస్ రావాలి అంటే, ఒక పని చేయాల్రా అబ్బాయ్’ అంటూ మొదటిసారి ఎన్టీఆర్ కి తన డబ్బులతో చుట్ట కొని తాగించాడట ‘ముక్కామల’.
Also Read: ‘సినీ పెద్ద’ గా చిరు పాత్ర పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ !
అందుకే, అప్పటి నుంచి ఎన్టీఆర్ ముక్కామలను ధూమపాన గురువుగారు అని సరదా పిలిచేవారు. నిజానికి పాతాళ భైరవి లో మాంత్రికుడి వేషం మొదట ముక్కామలకే దక్కాల్సింది. అయితే విధి నిర్ణయం వేరుగా ఉంది. చివరి క్షణంలో ఆయనకు ఆ వేషం మిస్ అయింది. ఆయన కంటే ఎన్టీఆరే ఆ విషయంలో ఎక్కువ బాధ పడ్డారట. నిజంగా ఆ వేషం ముక్కామల వేసి ఉంటే ఆయన సినీ జీవితం మరోలా ఉండేది.
ఇక ముక్కామలలో నటుడు మాత్రమే కాదు, మంచి భావుకత ఉన్న దర్శకుడు కూడా ఉన్నాడు. ఇందుకు నిదర్శనమే.. ఆయన స్వీయ దర్శకత్వంలో స్వయంగా ఆయనే నిర్మించిన ‘మరదలు పెళ్లి, ‘బుప్యశ్ళంగ’ చిత్రాలు. ఈ చిత్రాల్లో ఎంతో గొప్ప భావుకత ఉంటుంది. మంచి కథలు ఉంటాయి. కానీ, ఈ రెండు చిత్రాలు ఆర్థికంగా ముక్కామలను బాగా నిరుత్సాహ
పరచాయి.
ఈ లోపు ముక్కామలకు వేషాలు కూడా తగ్గాయి. అంతలో తరం కూడా మారింది. ఆయనకు అనేక ఆర్ధిక కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ గారే ఆయనను ఆదుకున్నారు. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. మద్రాసులో ముక్కామల గారు ఇల్లు కట్టుకోవడానికి ఎన్టీఆర్ గారు సాయం చేశారు. పైగా ముక్కామల గారి లోని కళాకారుణ్ణి సమర్థవంతంగా ఉపయోగించుకుంది కూడా ఒక్క ఎన్టీఆర్ మాత్రమే.
Also Read: కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం.. జగన్ కి అర్ధమవుతుందా ?