
కరోనా వైరస్ సరి వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. కరోనా పేరు చెప్తే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే దేశంలో 123 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణాలో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. అటు ప్రభుత్వాలు, ఇటు సెలబ్రెటీలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, కరోనా పై అపోహలు వద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి ఒక వీడియో ద్వారా జాగ్రత్తలను వివరించారు. తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది కష్టకాలం అని, ప్రజారోగ్యం దృష్ట్యా మనం సామజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం అని, రద్దీ గా ఉండే ప్రాంతాలలో గుంపులుగా ఉండే ప్రజలపై కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుందని , కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు బయటకు వెళ్ళకుండా తమఇంట్లో నే ఉండాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
https://www.instagram.com/p/B90tz6unroJ/?utm_source=ig_web_copy_link