‘హేమ’ను వదిలిపెట్టను: నరేశ్ ఆగ్రహం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’లో మళ్లీ మాటల మంటలు అంటుకున్నాయి. ఈ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరుగనున్న ‘మా’ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించడంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు వేడెక్కాయి. ‘మా’కు శాశ్వత అధ్యక్ష భవనం ఏర్పాటు అనే నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ప్రకటించగా.. విష్ణు, జీవిత, […]

Written By: NARESH, Updated On : August 9, 2021 11:19 am
Follow us on

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’లో మళ్లీ మాటల మంటలు అంటుకున్నాయి. ఈ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరుగనున్న ‘మా’ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించడంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు వేడెక్కాయి.

‘మా’కు శాశ్వత అధ్యక్ష భవనం ఏర్పాటు అనే నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ప్రకటించగా.. విష్ణు, జీవిత, హేమ, నరసింహరావు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇటీవలే మీడియా ముందుకొచ్చిన ‘మా’ అధ్యక్షుడు నరేశ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీపడడంపై సవాళ్లు చేశారు. అనంతరం మంచు విష్ణుకు సపోర్టుగా మాట్లాడారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నటి హేమ బయటకొచ్చి ‘మా’ అధ్యక్షుడు నరేశ్ పై విరుచుకుపడ్డారు. ‘మా’ నిధులను దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. హేమ చేసిన ఆరోపణలపై ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ తాజాగా మళ్లీ స్పందించారు. హేమ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని’ అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇక కరోనా దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని వివరించారు.