Maa Election: ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Maa Election: మా అద్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నటుడు ప్రకాశ్​ రాజ్​.. అనంతరం తన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్యానెల్​ సభ్యులు కూడా మీడయా సమావేశంలో మాట్లాడుతూ.. వారంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ విషయంపై నటి శ్రీరెడ్డి ఆసక్తికర కామెంట్​ చేసింది. ప్రకాశ్​ రాజ్​ సహా ప్యానెల్​ సభ్యులు రాజీనామా చేయడం వెనక మెగా బ్రదర్స్​ హస్తం ఉందని ఆరోపించింది. ఎప్పటినుంచో తమ ఆధీనంలో ఉన్న మా […]

Written By: Raghava Rao Gara, Updated On : October 14, 2021 3:18 pm
Follow us on

Maa Election: మా అద్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నటుడు ప్రకాశ్​ రాజ్​.. అనంతరం తన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్యానెల్​ సభ్యులు కూడా మీడయా సమావేశంలో మాట్లాడుతూ.. వారంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ విషయంపై నటి శ్రీరెడ్డి ఆసక్తికర కామెంట్​ చేసింది. ప్రకాశ్​ రాజ్​ సహా ప్యానెల్​ సభ్యులు రాజీనామా చేయడం వెనక మెగా బ్రదర్స్​ హస్తం ఉందని ఆరోపించింది. ఎప్పటినుంచో తమ ఆధీనంలో ఉన్న మా అసోసియేషన్​ చేజారిపోయినందువల్ల పవన్​, నాగబాబు కలిసి ఈ డ్రామా క్రియేట్​ చేశారని పేర్కొంది. మా ఎలక్షన్స్​లో అన్యాయం జరిగిందంటూ.. ప్రకాశ్​రాజ్​, ప్యానెల్​ సభ్యులు పబ్లిసిటీ స్టంట్​లు చేస్తున్నారంటూ మండిపడింది. ముఖ్యంగా నటులు హేమ, ఉత్తేజ్​, బెనర్దీ, తనీశ్​, శ్రీకాంత్​లపై తీవ్రంగా విరుచుకుపడింది.

 

రాజీనామా చేసిన ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ ఓటమిని ఒప్పుకోవాలని చెప్పింది. ‘మా’కు సేవ చేస్తానని చెప్పిన వాళ్లు చిత్ర పరిశ్రమను రెండుగా ఎందుకు చీలుస్తున్నారని ప్రశ్నించింది. మోహన్​బాబు చిత్రసీమకు పెద్దదిక్కులాంటివారని పేర్కొంది.

ఓటమి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్​రాజ్​… మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్యానెల్​ సభ్యులు కూడా ఎన్నికలు జరిగిన తీరును తిరస్కరిస్తూ.. తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే బెనర్జీ, శ్రీకాంత్​, తనీశ్​ తదితర ప్యానెల్​ సభ్యులు ఎన్నికల్లో జరిగిన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రకాశ్​రాజ్​ మరో అసోసియేషన్​ పెడతారని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. అవన్నీ కేవలం పుకార్లని అటువంటి ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.