Koratala Shiva: సెన్షేషనల్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్యను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాగా, ఈ సినిమా తర్వాత చిరు భోళాశంకర్, గాడ్ఫాదర్ చిత్రాల్లో నటించనున్నారు. మరోవైపు, కొరటాల శివ కూడా ఎన్టీఆర్తో మరో సూపర్ హిట్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆచార్య సినిమా తర్వాత ఈ ప్రాజెక్టుపైనే శివ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబరులో ఎన్టీఆర్తో షూటింగ్ మొదలుపెట్టాలని శివ భావించారు. అయితే, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం కావడం వల్ల ఈ ఏడాది చివర వరకు తారక్ షూటింగ్లో పాల్గొనలేనట్లు సమాచారం. ఈ క్రమంలోనే అప్పటి వరకు షూటింగ్ ఆపకుండా మాస్టర్ప్లాన్ వేశారు శివ. ప్రస్తుతం ఎన్టీఆర్పై తీసే సన్నివేశాలు కాకుండా.. ఇతర తారాగణంతో షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. మరోవైపు ఫిబ్రవరిలో ఆచార్య సినిమా విడుదల తేదీ ఉండటం వల్ల.. ప్రమోషన్స్ కోసం కాస్త గ్యాప్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో షూటింగ్ను కంటిన్యూ చేయనున్నారట. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్చరణ్కూడా కనిపించనున్నారు. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.