ఎడమ కంటి చూపు కోల్పోయిన మహేశ్

సినీ విమర్శకుడు, బిగ్ బాస్ ఫేం కత్తి మహేశ్ ఎడమ కంటి చూపు కోల్పోయినట్లు సమాచారం. ఈమేరకు ఆయన మేనమామ శ్రీరాములు వైద్యులు తమకు చెప్పినట్లు మీడియాకు వెల్లడించారు. ఆయన గాయపడడంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల పోస్టులు వచ్చాయి. కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగెటివ్ గా ఇంకొందరైతే శాపనార్థాలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై రోజురోజుకు రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఆదివారం ఆయనకు ఏ ప్రమాదం లేదని చెప్పినా సోమవారం మాత్రం ఆయన […]

Written By: Raghava Rao Gara, Updated On : June 28, 2021 2:02 pm
Follow us on

సినీ విమర్శకుడు, బిగ్ బాస్ ఫేం కత్తి మహేశ్ ఎడమ కంటి చూపు కోల్పోయినట్లు సమాచారం. ఈమేరకు ఆయన మేనమామ శ్రీరాములు వైద్యులు తమకు చెప్పినట్లు మీడియాకు వెల్లడించారు. ఆయన గాయపడడంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల పోస్టులు వచ్చాయి. కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగెటివ్ గా ఇంకొందరైతే శాపనార్థాలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై రోజురోజుకు రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఆదివారం ఆయనకు ఏ ప్రమాదం లేదని చెప్పినా సోమవారం మాత్రం ఆయన ఎడమ కన్ను చూపు కోల్పోయినట్లు వార్తలు రావడం సంచలనం సృష్టిస్తోంది. విజయవాడ నుంచి చిత్తూరుకు స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న కత్తి మహేశ్ రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఈ ఘటనలో కత్తి మహేశ్ కు తల, ముక్కు, కంటికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. వెంటనే ఆయన్ను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న మాత్రం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పినా ఇంతలోనే ఆయన కంటిచూపు కోల్పోయినట్లు చెప్పడం గమనార్హం.

సోమవారం రెండు కళ్లకు ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. కానీ ఆయన ఎడమ కన్ను చూపు కోల్పోయినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన మేనమామ శ్రీరాములు ఈ విషయం మీడియాకు వెల్లడించారు.తలలో తీవ్ర రక్తస్రావం జరగకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు చెప్పారు. మహేశ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.