Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందంటే.. నర్సమ్మను బస్తీ వాళ్ళు వెళ్లగొట్టడంతో మోనిత కేరళ నుంచి విన్నీ అనే ఒక కొత్త పని మనిషి పెట్టుకుంటుంది. ఇక విన్నీ స్వయంగా వారణాసి ఆటోలో వస్తుంది. ఇక ఆమెను చూసి వారణాసి మోనిత కోసమే వచ్చిందా అని అనుకుంటాడు. ఇక మోనిత వారణాసిని గమనిస్తూ తన మాటలతో బాగా రెచ్చిపోతుంది.
ఇక వారణాసి కోపంగా అక్కడనుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు దీప దారిన వెళ్తుంటే రుద్రాణి ఎదురవుతుంది. తనతో అప్పు గురించి మాట్లాడుతూ బెదిరిస్తుంది. ఇక దీప గట్టిగా తనకు వార్నింగ్ ఇస్తుంది. రుద్రాణి సంక్రాంతి ఆఫర్ అని పిల్లల్లో ఎవరినైనా ఒకరిని తీసుకుంటాను అనేసరికి దీప కొట్టడానికి చెయ్యి లేపుతుంది. గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
సౌందర్య ఆనందరావు ఆరోగ్యం గురించి ఆదిత్య తో మాట్లాడుతుంది. మరోవైపు కార్తీక్ పిల్లల కోసం భోజనం తేవడానికి ఇంట్లో భోజనం వెతుకుతాడు. ఇంట్లో ఏమీ లేకపోయేసరికి ఒక హోటల్ దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ హోటల్ యజమాని కార్తీక్ ను తన మాటలతో అవమానిస్తాడు. కార్తీక్ చేసేదేమీలేక ఆ హోటల్లో పని చేసి పిల్లలకు భోజనాన్ని తీసుకెళ్తాడు. మరోవైపు దీప రుద్రాణి అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
మద్యలో దాహం వేయటంతో దాహం తీసుకుంటుంది. ఇక తరువాయి భాగం లో కార్తీక్ పిల్లలకు భోజనం చేయిస్తాడు. తిరిగి హోటల్ కు వచ్చేస్తాడు. అదే సమయంలో అక్కడ దీప ఉండటంతో.. ఆ హోటల్ యజమాని దీపకు వంటలు చేసే అవకాశం ఇస్తాడు. ఆ సమయంలో కార్తీక్, దీప ల పరిస్థితులు చూస్తే బాగా ఎమోషనల్ గా అనిపిస్తుంది. మొత్తానికి డైరెక్టర్ ఈ సీరియల్ ను బాగా ఎమోషనల్ గా సాగదీస్తూ ప్రేక్షకులనుఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాడు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Karthikadeepam serial touching with emotional scenes with day by day the situation is they can not put food to the children
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com