
పూరి జగన్నాథ్ నిర్మించిన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన కంగనా రనౌత్ ఆ తరవాత హిందీ చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది. ఇంకొంచెం ముందుకెళ్లి దర్శకురాలుగా కూడా మారింది . ” ఫ్యాషన్ , తను వెడ్స్ మను , కైట్స్ , క్వీన్ , మణికర్ణిక ” వంటి చిత్రాలతో హిందీలో తనకంటూ ఓ స్థానం సంపాదించు కొంది. కంగనా రనౌత్.ఇపుడు బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరు.
స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి
కాగా ఇటీవల కంగనా రనౌత్ ఒక ఆశ్చర్యకర వార్త బయట పెట్టింది .తెలుగు సినీ రంగంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన ‘పోకిరి’ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ నాకే అఫర్ వచ్చిందని తెలిపింది. సరిగ్గా అదే సమయానికి తాను ‘గ్యాంగ్ స్టర్’ అనే హిందీ చిత్ర అఫర్ రావడం తో “పోకిరి ” చిత్రాన్ని వదులు కొన్నానని తెలిపింది .ఆడిషన్స్ కు వెళ్లిన ఫై రెండు సినిమాల్లో తనకు అవకాశం వచ్చిందని… అయితే, ‘గ్యాంగ్ స్టర్’కు ముందుగానే డేట్లు ఇచ్చేయడంతో, ‘పోకిరి’ సినిమా చేయలేకపోయానని తెలిపింది. అలా ‘పోకిరి’ సినిమా వదులు కొని తెలుగులో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించు కోలేక పోయానని ఒకింత భాదతో చెప్పింది .