IT Ride: తమిళ్ సూపర్స్టార్ ఇళయతలపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా నిర్మాత జేవియర్ బ్రిటో ఇంటిపై ఐటీ శాఖ దాడి చేసింది. ఆయన ఆస్తులకు సంబంధించి పలు అనుమానాలు రావడంతో ఆదాయపు పన్ను శాఖ బ్రిటో ఇంట్లో తనిఖీ నిర్వహించింది. చైనా మొబైల్ తయారీ కంపెనీలకు సంబంధించి బ్రిటోకు చెందిన ఆదంబాక్కం ఇల్లు, అడయార్ కార్యాలయంపై దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

మొబైల్ కంపెనీతో బ్రిటో పెట్టుకున్న సంబంధాలే ఐటీ సాదాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలోనూ మాస్టర్ సినిమా షూటింగ్ సమయంలో హీరో విజయ్ని ఐటీ శాఖ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా సూపర్ హిట్గా నిలిచిన బిగిల్ బాక్సాఫీసు కలెక్షన్లకు సంబంధించి వివరాలు ఆరా తీసింది.
ప్రస్తుతం బీస్ట్ సినిమాలో విజయ్ కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్నఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కాగా, సెల్వ రాఘవన్, యోగిబాబు, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యాంక్రోల్ చేసిన ఈ సినిమా 2022లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే, విడుదల ఎప్పుడన్నది మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మాస్టర్ సినిమాతో సూపర్హిట్ అందుకున్న విజయ్.. బీస్ట్ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులోనే విజయ్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.