రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విరాటపర్వం’. ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తుది దశకు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. కాగా, పిరియాడిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హాలీవుడ్ కెమెరామ్యాన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా… హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచెర్ పోరాటఘట్టాలకు యాక్షన్ కొరియోగ్రఫీ సమకూర్చుతుండడం విశేషం. ఈ రెండు అంశాలు కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతాయని చిత్ర వర్గాల సమాచారం.