Krishnam Raju Daughters : కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లి కాలేదు.? ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా?

Krishnam Raju Daughters  : రెబల్ స్టార్ కృష్ణంరాజు నిన్న ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 83 ఏళ్ల వయసులో పోస్ట్ కరోనా వ్యాధులతో చనిపోయారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.ఆయన అంత్యక్రియలు నిన్న సోమవారం ముగిశాయి. మొయినా బాద్లోని కనకమామిడి ఫాంహౌస్ లో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు వ్యక్తిగత విషయాలు చూస్తే.. ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. […]

Written By: NARESH, Updated On : September 13, 2022 9:31 am
Follow us on

Krishnam Raju Daughters  : రెబల్ స్టార్ కృష్ణంరాజు నిన్న ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 83 ఏళ్ల వయసులో పోస్ట్ కరోనా వ్యాధులతో చనిపోయారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.ఆయన అంత్యక్రియలు నిన్న సోమవారం ముగిశాయి. మొయినా బాద్లోని కనకమామిడి ఫాంహౌస్ లో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజుకు అంత్యక్రియలు నిర్వహించారు.

కృష్ణంరాజు వ్యక్తిగత విషయాలు చూస్తే.. ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట కృష్ణంరాజుకు సీతాదేవి అనే మహిళతో వివాహం జరిగింది. 1995లో సీతాదేవి కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణంతో ఒంటరివాడైన కృష్ణంరాజుకు బంధువులు అంతా కలిసి 1996 సెప్టెంబర్ 20న శ్యామలాదేవితో రెండో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు.

కృష్ణంరాజుకు మొదటి భార్యతో ఒక కూతురు.. రెండో భార్యతో ఇద్దరు కూతుళ్లు కలిగారు. కృష్ణంరాజు పెద్ద కుమార్తె పేరు ‘సాయి ప్రసీద’. ఈమె లండన్ లో ఎంబీఏ చదివారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ సినిమాతో నిర్మాతగా కూడా సాయి ప్రసీద నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కృష్ణంరాజు స్థాపించిన ‘గోపీకృష్ణ మూవీస్’ నిర్మాణ సంస్థను ఈమె చూసుకుంటోంది.

రెండో కుమార్తె సాయి ప్రకీర్తి. హైదరాబాద్ లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతోంది. మూడో అమ్మాయి సాయి ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. వీరు ముగ్గురులో కెరీర్ లో మంచి పొజిషన్ కు చేరుకునేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నారు. చదువులు పూర్తి కావడంతో మంచి కెరీర్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు. ఇక కూతుళ్ల పెళ్లి చూడకుండానే కృష్ణంరాజు మృతిచెందడం విషాదం నింపింది. ఆయన చిరకాల కోరిక కూతుళ్ల పెళ్లి చూడాలని.. అది తీరకుండానే వెళ్లిపోయారు.