Shobhita Dhulipala: కెరీర్ లో హీరోయిన్ గా పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయం లోనే అక్కినేని నాగ చైతన్య ని పెళ్ళాడి శోభిత ధూళిపాళ్ల నేషనల్ వైడ్ గా ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాగ చైతన్య కి అప్పటికే సమంత తో విడాకులు జరిగింది. ఈమెని పెళ్లి చేసుకోవడం తో , కేవలం ఈమె కారణం వల్లే, నాగ చైతన్య సమంత విడిపోయారంటూ శోభిత పై సోషల్ మీడియా లో టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్స్ చేశారు ఒక సెక్షన్ కి సంబంధించిన నెటిజెన్స్. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఏ చిన్న పోస్ట్ పెట్టినా ఆ సెక్షన్ నెటిజెన్స్ నెగెటివ్ కామెంట్స్ తో నింపేసేవారు. ఇది నిజంగా చాలా శోచనీయమైన సంఘటన అని చెప్పొచ్చు. తనపై ఇలా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్ పై అనేక సార్లు శోభిత స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె దీన్ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముందుగా యాంకర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు మీ జీవితం లో ఏ విషయాన్ని మర్చిపోవాలని అనుకుంటున్నారు’ అని అడగ్గా, అందుకు శోభిత సమాధానం చెప్తూ ‘నిన్నటి వరకు నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మర్చిపోవాలని అనుకుంటున్నాను. సాధారణంగా మతిమరుపుని జనాలు ఒక జబ్బు గా భావిస్తుంటారు. కానీ నా దృష్టిలో మతిమరుపు కొన్ని సందర్భాల్లో చాలా మంచిది. ఎందుకంటే ఇతరులు మనకు చేసిన బాధాకరమైన సంఘటనలు , చేదు జ్ఞాపకాలు మనల్ని మానసికంగా కృంగదీస్తాయి. వాటిని మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తే జీవితం లో ఏది సాధించలేం. అందుకే మతిమరుపు కొన్ని సందర్భాల్లో వరం లాంటిది, నిన్నటి గురించి ఆలోచించకుండా, కేవలం భవిష్యత్తు గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది శోభిత ధూళిపాళ్ల.
ఇకపోతే నాగ చైతన్య తో పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన శోభిత , ఇప్పుడు వరుస సినిమాలు , వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా మారిపోయింది. రీసెంట్ గానే చీకట్లో అనే అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన శోభిత , ఇప్పుడు ప్రముఖ దర్శకుడు పీఏ రంజిత్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘వేట్టువం’ లో హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతుండగా , మరికొన్ని కథలు , వెబ్ సిరీస్ లకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
