Senior Telugu Directors Struggling: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. కెరియర్ మొదట్లో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం స్టార్ హీరోలను లీడ్ చేయడంలో మాత్రం తడబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న స్టార్ హీరోలతో సినిమాలను చేసే స్థాయిని కూడా వాళ్ళు అందుకోలేకపోతున్నారు. కారణమేదైనా కూడా ఒకప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా పేరుపొందిన వాళ్ళందరు ఇప్పుడు ఎందుకని వెనుకబడి పోతున్నారు కారణం ఏంటి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, హరీష్ శంకర్ లాంటి దర్శకులు కావడం విశేషం…అయితే వీళ్ళందరు తమ కెరీర్ ని సక్సెస్ ఫుల్ సినిమాలతో స్టార్ట్ చేశారు. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు చేస్తున్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించడం లేదు.
ఈ జనరేషన్లో ఉన్న ప్రేక్షకులను మెప్పించడంలో వీళ్ళు చాలా వరకు వెనుకబడిపోయారు. పూరి జగన్నాథ్ లైగర్ సినిమా నుంచి పూర్తిగా డీలా పడిపోయాడనే చెప్పాలి. అంతకుముందు చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఓకే అనిపించుకుంది. ఇక లైగర్ తర్వాత చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా డిజాస్టర్ గా మారింది. ఇప్పుడు విజయ్ సేతుపతి తో చేస్తున్న స్లమ్ డాగ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన భావిస్తున్నాడు.
మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… శ్రీను వైట్ల సైతం గతంలో స్టార్ హీరోలందరితో సినిమాలను చేశాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. గత సంవత్సరం గోపీచంద్ తో చేసిన ‘విశ్వం’ సినిమా సైతం డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.
ఇక ఇప్పుడు ఆయన శర్వానంద్ తో చేయబోతున్న సినిమా ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక హరీష్ శంకర్ సైతం గత రెండు సినిమాలతో భారీగా డీలాపడ్డాడు. గతంలో మంచి సక్సెస్ లను సాధించిన ఆయన రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్, పవన్ కళ్యాణ్ తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలతో డిజాస్టర్ లను అందుకున్నాడు. ఇక ఇప్పటికైనా వీళ్ళందరు వాళ్ళ స్ట్రాటజీని మార్చి సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…