Homeఎంటర్టైన్మెంట్చేస్తే నయనతారతోనే అంటున్న డైరెక్టర్

చేస్తే నయనతారతోనే అంటున్న డైరెక్టర్


విజయ శాంతి తర్వాత సౌతిండియాలో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ సొంతం చేసున్న నాయిక నయనతార. దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ ఆమెకు విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం షూటింగ్స్‌ మాత్రమే డేట్స్‌ ఇస్తుందామె. ఆడియో, ప్రి రిలీజ్‌ సహా ఎలాంటి ప్రమోషన్‌ ఈవెంట్లకు అస్సలు రాదు. అయినా సరే ఆమెకున్న స్టార్డమ్‌ దృష్ట్యా నయనతారతో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తుంటారు. ఆమె డేట్స్‌ సంపాదించడం కోసం పోటీ పడుతారు. ఎంత ఖర్చైనా.. ఎంతకాలం వేచి చూసినా కొన్ని చిత్రాలు, క్యారెక్టర్లు ఆమెతోనే చేయించుకుంటారు. ఆ లిస్ట్‌లో తమిళ దర్శకుడు గోపీ నైనర్ కూడా ఉన్నాడు. ఓ సీక్వెల్‌ మూవీలో నయనతారను తప్ప మరో హీరోయిన్‌ను ఊహించుకోలేనని స్పష్టం చేశాడు.

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

గోపీ నైనర్- నయన్‌ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఆరమ్‌’ (తెలుగులో కర్తవ్యం). కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిందీ. బోరు బావిలో పడ్డ ఓ చిన్నారిని కాపాడం, ఓ ఊరి సమస్యను తీర్చే కలెక్టర్ పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. ఈ మూవీకి గోపీ సీక్వెల్‌ ప్లాన్‌ చేశాడట. అయితే, ఇందులో హీరోయిన్‌గా నయన్‌ నటించడం లేదని, ఆమె స్థానంలో కీర్తి సురేశ్‌కు ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఫుల్‌ బిజీగా ఉన్న నయనతార డేల్స్‌ అడ్జట్స్‌ చేయలేకపోవడంతో కీర్తిని సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు కోలీవుడ్‌ వర్గాలు చెప్పాయి. కానీ, ఇవన్నీ ఒట్టి పుకార్లే అని దర్శకుడు గోపీ నైనన్ స్పష్టం చేశాడు. నయన్‌ డేట్స్‌ ఇవ్వలేదన్న వార్తల్లో నిజం లేదన్నాడు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దన్నాడు. ‘ఆరమ్’కు సీక్వెల్‌ తీస్తే నయనతారతోనే తీస్తానని తేల్చి చెప్పాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular