CM Vijay Sangeetha divorce case: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్, సంగీత విడాకుల వ్యవహారం పై సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మనమంతా చూస్తూనే ఉన్నాం. విజయ్ తల్లి శోభా చంద్ర శేఖర్ , ఈ భార్య భర్తలు కలిపే బాధ్యతని భుజాన వేసుకొని , దిగ్విజయం గా చర్చలతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు చెరిపేసి, ఒకటి చేసిందని, ఈ కారణం చేత లండన్ లో ఉన్న సంగీత ఇప్పుడు చెన్నై కి తిరిగి వచ్చేసిందని , సీఎం విజయ్ ఇంట్లోనే ఆమె ఉంటున్నట్టు వార్తలు వినిపించాయి. ఇందులో ఎంతో మాత్రం నిజముందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది కానీ , వీళ్లిద్దరి విడాకుల వ్యవహారం ఇప్పటికీ కోర్టు లోనే ఉంది. ఎన్నికలకు ముందు సంగీత చెంగాలపట్టు ఫ్యామిలీ కోర్టులో, తనకు విజయ్ నుండి విడాకులు కావాలంటూ ఒక పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటీషన్ పై నేడు చెంగాలపట్టు ఫ్యామిలీ కోర్టు విచారణ చేపట్టింది. ఎలాంటి తీర్పు వస్తుందో అని ఆసక్తి గా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఎందుకంటే ఈ కేసుని ఆగస్టు 7 కి వాయిదా వేస్తున్నట్టు మహిళా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విడాకుల వ్యవహారం గురించి తీర్పు కోసం మరో నెల రోజులకు పైగా ఎదురు చూడక తప్పదు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా ప్రస్తుతం సీఎం విజయ్ కి సంబంధించి ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఇందులో ఆయన తన భార్య సంగీత తో పాటు , పిల్లలతో కలిసి డిన్నర్ చేస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రస్తుతానికి AI ద్వారా జెనెరేట్ చేసిన ఫోటో అయ్యుండొచ్చు , కానీ రాబోయే రోజుల్లో ఇది నిజం కాబోతుంది అంటూ విజయ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, అయితే పాపం త్రిష పరిస్థితి ఏంటి ఇప్పుడు?, ప్రస్తుతం త్రిష తో విజయ్ సహజీవనం చేస్తున్నాడు అనేది నిజం. ఇద్దరూ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించేశారు. ఎన్నికలకు ముందు వీళ్లిద్దరు జంటగా కలిసి ఒక పెళ్లి ఫంక్షన్ కి వెళ్లడం, అదే విధంగా ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత త్రిష అందరికంటే ముందు విజయ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం, రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ అజిత్ తల్లి చనిపోయినప్పుడు విజయ్ తో జంటగా కలిసి త్రిష అజిత్ ఇంటికి వెళ్లడం వంటివి చాలానే జరిగాయి. బహిరంగంగానే వీళ్లిద్దరు ఇప్పుడు కలిసి తిరుగుతున్నారు. మరి భార్య సంగీత ని విజయ్ మళ్లీ తన జీవితం లోకి ఆహ్వానిస్తే త్రిష ని దూరం పెట్టేస్తాడా?, లేకపోతే త్రిష తర్వాతే తన భార్యకు ప్రాధాన్యత అన్నట్టుగా ఉంటాడా అనేది చూడాలి.
