
ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో తన టాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకొన్న పూరి జగన్నాధ్ ఇపుడు రెట్టించిన ఉత్సాహం తో మరో సినిమా మొదలెట్టాడు .ఆ క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘ఫైటర్’ చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్రెడీ షూటింగ్ కూడా కొంత జరిగింది. ముంబైలోని ‘ధారావి’ స్లమ్ ఏరియా నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. ఇక్కడే విజయ్ దేవరకొండపై చాలా సన్నివేశాలను తీయాలని కూడా షెడ్యూల్ వేసుకొన్నారట …ఆ క్రమం లో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. .ఇపుడు లాక్ డౌన్ అడ్డంకి కారణంగా షూటింగు ఆగిపోయింది.
అదలా ఉంటే ఇపుడు ఊహించని రీతిలో మరో అడ్డంకి వచ్చింది .ఇటీవల ‘ధారావి’ ప్రాంతం నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ వున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ను చాలా కాలం కొనసాగించే అవకాశం కనపడుతోంది. అదీగాక లాక్ డౌన్ తరువాత కూడా అక్కడ షూటింగ్ జరపడానికి అంత తేలికగా అనుమతులు లభించకపోవచ్చని పూరీ జగన్నాధ్ టీం భావిస్తోంది. ‘ధారావి’ కథా నేపథ్యంతో ముడిపడిన ఈ చిత్రానికి అదే ప్రాంతం లో షూటింగు జరుపుకునే అవకాశం లేకుండా పోవడంతో సినిమా పూర్తి అవుతుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి .