
కరోనా వైరస్ విస్తృతమౌతున్న తరుణంలో భారతీయ చలన చిత్ర రంగానికి చెందిన ఎందరో తారలు సోషల్ మీడియా లో ప్రజల్ని చైతన్య పరచడం మొదలెట్టారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కాగా వివిధ భాషల అగ్ర తారల కలయికలో తాజాగా మరో వీడియో రూపొందించడం జరిగింది. హిందీ , తెలుగు , తమిళ రంగాలకు చెందిన శిఖరాగ్ర నటుల కలయికలో కరోనా వైరస్ ఫై రూపొందించిన ఒక షార్ట్ ఫిలిం రేపు మన ముందుకి రాబోతుంది.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహకారంతో ప్రసూన్ పాండే దర్శక పర్యవేక్షణలో కరోనా వైరస్ సంబంధంగా ఒక షార్ట్ ఫిలిం రెడీ అయ్యింది. ఇందులో అమితాబ్ బచ్చన్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , మెగా స్టార్ చిరంజీవి , రణబీర్ కపూర్ , ప్రియాంక చోప్రా , అలియా భట్ నటించడం జరిగింది. కాగా ఈ లఘు చిత్రానికి ‘ఫామిలీ ‘ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఇక ఈ లఘు చిత్రం లో కరోనా వైరస్ ని నివారించడం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెబుతారట … ఇంట్లో ఎలా మసలు కోవాలి ,ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు , మంచి ఆహారం ఏం తీసుకోవాలి , సామాజిక దూరం ఎలా పాటించాలి వంటి అంశాలు ఉంటాయట … అలా రూపొందిన ” ఫామిలీ ” లఘు చిత్రం మార్చ్ 6 సోమవారం రాత్రి 9 గంటలకు సోనీ నెట్ వర్క్ ద్వారా ప్రసారం కాబోతుంది.