Bigg Boss Telugu 7: ఎపిసోడ్ హైలెట్స్… కొత్త కెప్టెన్ కి నాగ్ వార్నింగ్! రతిక, దామిని, శుభశ్రీ రీఎంట్రీ!

వీరి మధ్యలోకి సందీప్ వచ్చాడు.నీకు ఎందుకు, నువ్వు ఎందుకు వచ్చావ్ అంటూ యావర్ రూడ్ గా మాట్లాడాడు. వీడియో చూపించి నాగార్జున ' యావర్ కెప్టెన్ అయిన తర్వాత నీ బాడీ లాంగ్వేజ్,ఆటిట్యూడ్ చాలా మారింది కదా అంటూ నాగార్జున ప్రశ్నించాడు. గుర్తుపెట్టుకో యావర్ మంచి నాయకుడిగా ఉండు అని వార్నింగ్ ఇచ్చారు నాగార్జున .

Written By: Shiva, Updated On : October 15, 2023 9:25 am

Bigg Boss Telugu 7

Follow us on

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 ఆరో వారం చాలా రసవత్తరంగా సాగింది. ఆటగాళ్లు – పోటుగాళ్ల మధ్య జరిగిన పోటీలో, ఆటగాళ్లే విజయం సాధించారు. కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు.టాస్క్ లో గెలిచిన ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ ఇంటి రెండవ కెప్టెన్ అయ్యాడు. ఇక శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. కొత్త కెప్టెన్ యావర్ ని అభినందించాడు. అనంతరం యావర్, అమర్ దీప్ మధ్య జరిగిన ఓ గొడవకు సంబంధించిన వీడియో నాగార్జున చూపించాడు. అమర్ స్ప్రైట్ టిన్ తీసుకోవడానికి ట్రై చేసాడు. యావర్ దానికి ఒప్పుకోలేదు. అమర్ ని వెనక్కి తోసాడు,యావర్ తినే విషయంలో, తాగే విషయంలో ఇలా చేయకూడదు అని అన్నాడు అమర్ . లేదు బ్రో అంటూ యావర్ వాదించాడు.

వీరి మధ్యలోకి సందీప్ వచ్చాడు.నీకు ఎందుకు, నువ్వు ఎందుకు వచ్చావ్ అంటూ యావర్ రూడ్ గా మాట్లాడాడు. వీడియో చూపించి నాగార్జున ‘ యావర్ కెప్టెన్ అయిన తర్వాత నీ బాడీ లాంగ్వేజ్,ఆటిట్యూడ్ చాలా మారింది కదా అంటూ నాగార్జున ప్రశ్నించాడు. గుర్తుపెట్టుకో యావర్ మంచి నాయకుడిగా ఉండు అని వార్నింగ్ ఇచ్చారు నాగార్జున .

సందీప్ నువ్వు గొడవ ఆపడానికి వెళ్లవు కానీ, నీ వల్ల గొడవ ఇంకా పెద్దదైంది అని నాగార్జున అనగానే చూస్తూ నిలబడిపోయాడు సందీప్. ఇక నాగార్జున ఎయిమ్ లెస్, బ్రెయిన్ లెస్, యూజ్ లెస్ ఎవరో చెప్పి మెడలో బోర్డ్స్ వెయ్యాలని నాగార్జున చెప్పాడు. అత్యధికంగా భోలే షావలికి ఎయిమ్ లెస్ బోర్డ్స్ పడ్డాయి. అనంతరం అమర్ దీప్, అశ్విని శ్రీలకు బ్రెయిన్ లెస్ పడ్డాయి. కాగా అమర్ దీప్ గేమ్ మెరుగైందని నాగార్జున మెచ్చుకున్నాడు.

ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన దామిని,రతిక,శుభశ్రీ మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసి హౌస్ మేట్స్ తెగ సంబర పడిపోయారు. ఈ ముగ్గురిలో ఎవరు హౌస్లోకి వచ్చేది తేల్చేది మీరే అని కంటెస్టెంట్స్ కే వదిలేశాడు నాగార్జున. అలాగే తమకు కంటెస్టెంట్స్ ఓట్లు వేసేలా క్యాంపైన్ చేసుకోవాలని చెప్పాడు. ముగ్గురు తమ శైలిలో కంటెస్టెంట్స్ ని ఓట్లు అడిగారు. అత్యధికంగా కంటెస్టెంట్స్ ఓట్లు పొంది హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చేది ఎవరో నేటి ఎపిసోడ్లో తేలనుంది.