Bigg Boss 7 Telugu: నా పేరెంట్స్ గురించి తీయొద్దు… అశ్వినికి వార్నింగ్ ఇచ్చిన శోభా!

తాజా ప్రోమో లో శోభా,శివాజీ తనని నామినేట్ చేసినందుకు తిరిగి శివాజీ ని నామినేట్ చేసింది. దీనికి శోభా రీజన్ చెప్తూ 'మీరు నామినేషన్స్ రోజు ఈ పాయింట్ రెయిజ్...

Written By: NARESH, Updated On : October 23, 2023 6:38 pm
Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అంటేనే ఆడియన్స్ కి ఫుల్ మజా వస్తుంది. కారణం.. నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు.తిట్టుకుంటూ,అరుచుకుంటూ హౌస్ ను హీట్ ఎక్కించేస్తారు. ఈ క్రమంలోనే ఈ వారం కూడా నామినేషన్స్ మంచి హీట్ మీద సాగుతున్నాయి. తాజా ప్రోమో లో శోభా,శివాజీ తనని నామినేట్ చేసినందుకు తిరిగి శివాజీ ని నామినేట్ చేసింది. దీనికి శోభా రీజన్ చెప్తూ ‘మీరు నామినేషన్స్ రోజు ఈ పాయింట్ రెయిజ్ చేయడం నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను నెగిటివ్ గా చూపించడానికి ఒక మంచి అవకాశం మీకు’ అని అంది.

దీనికి శివాజీ కూడా గట్టిగానే సమాధానం చెప్పాడు.నిన్ను ఇక్కడ నుంచి పంపించాలంటే నువ్వు మాత్రమే పోగలవు తప్ప నిన్ను ఎవ్వడు పంపలేదు అని శివాజీ చెప్పాడు. ఆ తర్వాత భోలే మన తప్పును మనం ఎప్పుడు ఒప్పుకోము అంటే శోభా మధ్యలో దూరింది. నువ్వు ఒక పర్సన్ హౌస్ లో ఉన్నావ్ అనే సెన్సే లేనప్పుడు నాకు నీ మీద స్పెషల్ గా కోపం ఎందుకు వస్తుంది చెప్పు అంటూ ఓవర్ చేసింది.

తర్వాత సందీప్ అశ్విని ని నామినేట్ చేశాడు. ఇక గౌతమ్ తన రెండు నామినేషన్లు ఒకటి ప్రశాంత్ కి మరొకటి భోలే కి వేశాడు. అశ్విని,శోభా ని నామినేట్ చేస్తూ ఒక మనిషికి కనీస మర్యాద అనేది ఎవరి తల్లిదండ్రులైనా నేర్పిస్తారు అని చెప్పింది.దీంతో నా పేరెంట్స్ గురించి తీయొద్దు అంటూ శోభా రెచ్చిపోయింది.

ప్రియాంక కూడా అశ్విని ని నామినేట్ చేసింది.ప్రతి ఒక్క అమ్మాయికి నీతో ప్రాబ్లమ్ ఎందుకు ఉంది అని అడిగింది.ఇక భోలే గౌతమ్ ని నువ్వు ఓ డాక్టర్ ఏదో నాడి పట్టుకుని నీకు జ్వరం ఉంది అన్నట్లు చెబుతున్నావ్ అంటూ కౌంటర్ వేశాడు. ప్రోమో చివర్లో శివాజీ హైలైట్ గా నిలిచాడు. అర్హత గురించి మాట్లాడితే ఈ హౌస్ లో ఉన్న ఎవరికి లేదు ఆఖరికి శివాజీ తో సహా అంటూ శోభా కి ఇచ్చి పడేశాడు.