Homeఎంటర్టైన్మెంట్ప్రభాస్ సరసన కియారా అద్వానీ

ప్రభాస్ సరసన కియారా అద్వానీ

సాహో తరవాత ప్రభాస్ చేస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంటే కరోనా లాక్ డౌన్ బ్రేక్ వేసింది . రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ తాజా చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ వుంది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే దీనిని రామోజీ ఫిలిం సిటీలో పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేశారు. మరోపక్క, ఇప్పటి వరకు పూర్తయిన షూటింగుకు సంబంధించిన ఎడిటింగ్ పనులను చక్క బెడుతున్నారు. […]


సాహో తరవాత ప్రభాస్ చేస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంటే కరోనా లాక్ డౌన్ బ్రేక్ వేసింది . రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ తాజా చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ వుంది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే దీనిని రామోజీ ఫిలిం సిటీలో పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేశారు. మరోపక్క, ఇప్పటి వరకు పూర్తయిన షూటింగుకు సంబంధించిన ఎడిటింగ్ పనులను చక్క బెడుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రం తరవాత తెరకెక్క బోయే చిత్రం కూడా లాక్ డౌన్ ముగియగానే పట్టాలెక్కేందుకు సిద్ధమౌతోంది . …

కాగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ ఫై అశ్విని దత్ నిర్మించ నున్నాడు .సుమారు 500 కోట్ల భారీ బడ్జట్ తో నిర్మితమౌతున్న ఈ చిత్రాన్ని `మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి . ప్రభాస్ హీరోగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించ బడే ఈ భారీ చిత్రాన్ని ఒక సైన్స్ ఫిక్షన్ జానర్ లో నిర్మించడానికి వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ పాత్రకు ముందుగా దీపికా పడుకొనే ని అనుకొన్నారు. కానీ దీపికా పడుకొనే 20 కోట్ల పారితోషకంగా అడగటం తో పాటు కొన్ని కండిషన్స్ పెట్టడం తో ఇపుడు ఆమె స్తానం లో ` భరత్ అనే నేను’ , ‘ వినయ విధేయ రామ ` ఫేమ్ బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper