Homeక్రైమ్‌Nagarkurnool: కట్టుకున్నవాడు కన్నుమూశాడు.. గుండెలు పగిలేలా భార్య రోదన.. ఓ చిన్న అనుమానం.. ఆమె బండారాన్ని...

Nagarkurnool: కట్టుకున్నవాడు కన్నుమూశాడు.. గుండెలు పగిలేలా భార్య రోదన.. ఓ చిన్న అనుమానం.. ఆమె బండారాన్ని బయటపెట్టింది

Nagarkurnool: కట్టుకున్నవాడు కన్నుమూశాడు. తనను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడని ఆయన భర్త గుండెలు పగిలే విధంగా రోదించడం మొదలుపెట్టింది. చూసేవాళ్లకు ఆసన్నివేశం అత్యంత బాధాకరంగా అనిపించింది. బంధువులు ఆమెను ఊరడించే ప్రయత్నం చేశారు. ఆమె ఎంతసేపటికి ఏడుపు ఆపడం లేదు. బంధువులు కూడా ఆమె బాధను అర్థం చేసుకొని వారూ ఏడవడం మొదలుపెట్టారు.

చనిపోయిన ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈలోగా అతడికి స్నానం చేయిస్తున్నారు. ఈ క్రమంలో మృతుడి తమ్ముడికి ఒక అనుమానం… ఎందుకంటే తన అన్న మర్మంగాల మీద గాయాలు కనిపించాయి. అవి అతడికి అనుమానాన్ని కలిగించాయి. అది మొదలు పెట్టుకున్నాడు. అంత్యక్రియలు పూర్తికాగానే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ మొదలుపెట్టారు. ఫలితంగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులు జీవిస్తున్నారు. వీరు తమ కూతురిని ఆంజనేయులు అనే వ్యక్తికి వివాహం చేశారు.. ఆంజనేయులు.. అలివేలు మధ్య సభ్య సమాజం తలదించుకునే సంబంధం ఏర్పడింది. ఈ విషయం యాదయ్యకు తెలిసింది. దీంతో అతడు అలివేలును.. అల్లుడిని అనేకసార్లు మందలించాడు. చాలాసార్లు ఈ వ్యవహారం మీద వారింట్లో గొడవలు జరిగాయి. దీంతో అలివేలు ఒక ప్లాన్ రూపొందించింది. యాదయ్యను అంతం చేయాలని నిర్ణయించుకుంది.

ఈనెల 23న యాదయ్య చనిపోయాడు. అతడు చనిపోయిన తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉంది. అయితే అతడు గుండెపోటుతో చనిపోయాడని అలివేలు కుటుంబ సభ్యులను నమ్మించింది. అంతే కాదు తాను కూడా గుండెలు పగిలే విధంగా రోధించింది. ఈ నేపథ్యంలో యాదయ్య మృతదేహానికి సాంప్రదాయం ప్రకారం స్నానం చేయిస్తున్నారు. ఆ సమయంలో యాదయ్య మర్మంగాల మీద కనిపించిన గాయాలు అతడి తమ్ముడిలో అనుమానం కలిగించాయి. వెంటనే అతడు తిమ్మాజీపేట పోలీసులకు విషయాన్ని చెప్పాడు.

పోలీసులు ఆ తర్వాత ఈ కేసును తమదైన శైలిలో దర్యాప్తు మొదలుపెట్టారు. అలివేలును గట్టిగా మందలించారు. దీంతో అల్లుడితో తాను సాగిస్తున్న బంధం గురించి అలివేలు బయట పెట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని చంపేసినట్టు అలివేలు పోలీసులతో చెప్పింది. ఈ వ్యవహారంలో ఆమె అల్లుడు పాత్ర పై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలివేలును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ సంఘటన సంచలనం కలిగించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular