Yamaha Hybrid Bike: కాలం మారుతున్న కొద్దీ బైక్ లలో అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం పెట్రోల్ తో నడిచే టూ వీలర్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు అడ్వాన్స్గా ఆలోచించి హైబ్రిడ్ వెహికల్స్ ను తీసుకొస్తున్నాయి. హైబ్రిడ్ వెహికల్స్ అంటే రెండు ఇంజన్లు ఉండడం. ఒకటి పెట్రోల్ ఇంజన్ తో పాటు మరొకటి ఎలక్ట్రిక్ వేరియంట్ తో కలిసి పనిచేయడం. ఇలా హైబ్రిడ్ ఇంజన్ కలిగిన బైక్ ఒకటి మార్కెట్లోకి రాబోతుంది. యమహా కంపెనీకి చెందిన ఈ బైక్ డిజైన్ తో పాటు హైబ్రిడ్ ఇంజన్ ఉండడం వల్ల యూత్ బాగా ఆదరిస్తారని కంపెనీ నమ్ముతోంది. ఇంతకీ ఇది ఏ బైక్? ఇందులో ఉండే విశేషాలేంటి?
Yamaha కంపెనీ నుంచి MT -09 PHEV అనే బైక్ రెడీ అవుతోంది. ఈ బైక్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఇంజన్ ప్రదేశంలో కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో రెండు రకాల ఇంజన్లు ఉంటాయి. ఒకటి 890 సిసి సామర్థ్యం కలిగిన పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది మూడు సిలిండర్లతో కలిసి పని చేస్తుంది. 50 కిలోమీటర్ల వేగం దాటిన తర్వాత మరో ఇంజన్ ఎలక్ట్రిక్ వేరియంట్ ఆటోమేటిక్ గా యాక్టివ్ అవుతుంది. సైలెంట్ మోడ్ లో వెళ్లే ఈ బైక్ నుంచి బయటకు వచ్చే కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువ. అంతేకాకుండా ఈ బ్యాటరీ చార్జ్ చేయడానికి వెనుక భాగంలో ప్రత్యేకంగా పోర్ట్ ను ఏర్పాటు చేశారు. దీంతో దీనిని చార్జింగ్ స్టేషన్లలో లేదా ఇంట్లో సులభంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ బైక్ ఇంజన్ పర్ఫామెన్స్ బెటర్ మాత్రమే కాకుండా టెక్నాలజీ లోనూ లేటెస్ట్ వారిని ఆకట్టుకుంటుంది. ఇందులో ఆకర్షనీయంగా TFT డిస్ప్లే కనిపిస్తుంది. ఈ డిస్ప్లేలో బైక్ కు సంబంధించిన అన్ని వివరాలు నమోదు అవుతాయి. ముఖ్యంగా బైక్ పనితీరుతో పాటు స్పీడ్, మోడ్, బ్యాటరీ స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
సాధారణంగానే యమహా బైక్ అనగానే యూత్ ఇంప్రెస్ అవుతారు. అలాంటి వారిని ఆకర్షించే విధంగా బైక్ డిఫరెంట్ కలర్ లలో మార్కెట్లోకి రాబోతోంది. ఇది మార్కెట్లోకి వస్తే కాస్త ధర ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది మార్కెట్లోకి వస్తే డుకాటి మాన్స్టర్, ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ పంటి వాటితో పోటీ పడుతుంది.