Xiaomi 17T Series: xiaomi కంపెనీ కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడంలో ఉత్సాహం చూపిస్తోంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా 17T సిరీస్ ను మొదటిసారిగా రెండు వేర్వేరు సైజుల ఫ్లాగ్షిప్ డిస్ప్లే వెర్షన్స్లో అందుబాటులోకి తీసుకువస్తోంది . ఈ సిరీస్లో స్టాండర్డ్ Xiaomi 17T, Xiaomi 17T Pro అనే రెండు మోడల్స్ ఉంటాయి. ఈ మొబైల్స్ లో ట్రిపుల్ కెమెరా ఉండడంతో పాటు వినియోగదారులకు అనుకూలంగా ఉండే ఫీచర్లు ఉండనున్నాయి. అయితే ఇవి మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి? వీటి వివరాల్లోకి వెళితె..
షియోమీ 17T సీరిస్ లో భాగంగా Xiaomi 17T 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్ ను అందిస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ని కలిగి ఉంటుంది. అయితే 17T Pro మరింత పెద్దగా 6.83-అంగుళాల AMOLED స్క్రీన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా 1.5K రిజల్యూషన్ తో నాణ్యమైన డిస్ ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ అధిక 144Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తుంది.
17T సీరీస్ లోని రెండు మొబైల్ MediaTek Dimensity 8500 Ultra చిప్సెట్ని కలిగి ఉంటుంది. దీనికి 12GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్ని సపోర్టు చేస్తుంది. అలాగే ఈ మొబైల్ లో 6,500mAh బ్యాటరీ ఉండగా.. 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 17T Pro మరింత శక్తివంతమైన MediaTek Dimensity 9500 ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 100W వైర్డ్ , 50W వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్టు చేస్తుంది.
కెమెరా విభాగంలో, రెండు మోడల్స్లోనూ Leica Summilux మూడు కెమెరా సెటప్ ను అమర్చారు. ఇవి 50MP మెయిన్ కెమెరా ఉండగా.. 50MP టెలిఫోటో తో పాటు 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా ఉండనుంది . 17T Proలో 50MP Light Fusion 950 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. స్టాండర్డ్ 17T 5x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో తో 120x డిజిటల్ జూమ్ని సపోర్ట్ చేస్తుంది.
గ్లోబల్ లో ఈ రెండు మొబైల్స్ May 28న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో స్టాండర్డ్ Xiaomi 17T జూన్ 4న లాంచ్ అవుతుంది.కానీ రెండు మోడల్స్ భారతదేశంలో అందుబాటులో ఉంటాయా అనేది ఇంకా ఖచ్చితంగా తెలియలేదు.
