Homeబిజినెస్రైతులకు షాక్.. పీఎం కిసాన్ డబ్బులు రావా..?

రైతులకు షాక్.. పీఎం కిసాన్ డబ్బులు రావా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తుండగా ఆ స్కీమ్ లలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ నెల తొలి వారమే రైతుల ఖాతాలలో నగదు జమ కావాల్సి ఉండగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు జమవుతాయని వెల్లడించారు. అయితే రైతుల ఖాతాలలో ఇప్పటివరకు నగదు జమ కాలేదనే సంగతి తెలిసిందే.

ప్రతి సంవత్సరం రైతులకు కేంద్రం ఈ స్కీమ్ కింద 6 వేల రూపాయలు అందిస్తోంది. కేంద్రం ఈ నగదును 2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేస్తుండటం గమనార్హం. వచ్చే నెలలో రైతుల ఖాతాలలో ఈ నగదు జమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేంద్రం జమ చేసే ఈ నగదు రైతులకు పెట్టుబడిసాయంగా ఉపయోగపడుతుంది.

ఇప్పటివరకు 7 విడతల నగదు రైతుల ఖాతాలలో జమైన సంగతి విదితమే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతుల కోసం పలు పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ అమలు చేస్తున్న ఈ పథకంపై రైతుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అర్హత ఉండి ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందలేని వాళ్లు ఆన్ లైన్ లో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా రైతులు ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version