Homeబిజినెస్Generation G and Z: ఈ జనరేషన్ తో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..

Generation G and Z: ఈ జనరేషన్ తో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..

Generation G and Z: భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ప్రజలు పెద్ద పాత్ర పోషిస్తారు. అంటే, ప్రజలు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థ అంతే వేగంగా పరుగుపెడుతుంది. భారతీయులు ఎలాగూ ఖర్చు పెట్టేందుకు ఇష్టపడతారు. అయితే, ఇందుకు వారికి ఉద్యోగాలు, ఆదాయంపై నమ్మకం అవసరం. ఇప్పుడు ఈ ఖర్చు భారతీయ యువతను అంటే ‘జనరేషన్ జీ‘ని పెంచడానికి సిద్ధంగా ఉంది. జెనరేషన్ G లో జనరేషన్ అంటే అందరికీ తెలిసిందే ఇక G అంటే ‘గ్లోబల్’, ‘ఉదారత’ అని అర్థం. వారి అభిరుచులు, వారి ప్రతిభ వారి దాతృత్వాన్ని స్వచ్ఛందంగా అందించేందుకు సిద్ధంగా ఉన్న యువతరం. ఈ యువకులు ‘సామాజిక’, ‘డిజిటల్’గా ఎదిగారు. జనరేషన్ Gలో 1997, 2012 మధ్య జన్మించిన తరం. ఈ తరాలు తమ ఖర్చు ద్వారా వినియోగాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), స్నాప్ చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ నివేదిక ప్రకారం 2035 నాటికి ఈ జనాభా 2 ట్రిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 168 లక్షల కోట్లు ఖర్చు పెడతారు.

ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవస్థకు ఊపునిస్తుంది. వినియోగ ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మొత్తం ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు దేశంలో నివసిస్తున్న అతిపెద్ద, యువ తరం అయిన జనరేషన్ Z 37.7 కోట్లకు పైగా ఉంది.

వారి మొత్తం వ్యయం 860 బిలియన్ డాలర్లు. ఇది దేశం మొత్తం వినియోగంలో 43 శాతం. 860 బిలియన్ డాలర్లలో 200 బిలియన్ డాలర్లు ఈ ప్రజలే ఖర్చు చేస్తున్నారని నివేదిక పేర్కొంది. మిగిలిన 660 బిలియన్ డాలర్లను వారి సిఫార్సులు లేదా ప్రాధాన్యతలతో ప్రభావితమైన ఇతరులు కొనుగోళ్ల కోసం ఖర్చు చేస్తారు.

2035 నాటికి ఇది రెండు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని జనరేషన్ Z జనాభా వ్యయ ధోరణి సూచిస్తోందని నివేదిక తెలిపింది. స్నాప్ ఇంక్ ప్రకారం.. భారతదేశం 377 మిలియన్లకు పైగా జనరేషన్ Z జనాభా ఉన్న దేశం.

వచ్చే రెండు దశాబ్దాల ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్
ఈ జనాభా తమ వినియోగం ద్వారా రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశ అభివృద్ధి భవిష్యత్ ను రూపొందిస్తాయి. 2025 నాటికి జనరేషన్ Z ప్రత్యక్షంగా 250 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 2035వ సంవత్సరం నాటికి వీరి వినియోగం 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకొని దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్ గా మారుతుందని అంచనా.

ప్రతి నలుగురు జనరేషన్ Z సభ్యుల్లో ఒకరికి ఇప్పటికే ఉద్యోగం ఉందని నివేదిక పేర్కొంది. 2025 నాటికి ప్రతి సెకండ్ జన్ Zకు ఆదాయ వనరు ఉంటుంది. అవకాశాలు ఉన్నప్పటికీ, చాలా వ్యాపారాలు జనరేషన్ Z ను వినియోగించుకోలేరని నివేదిక తెలిపింది.

కేవలం 15 శాతం మంది మాత్రమే వాటిని సద్వినియోగం చేసుకునేందుకు చురుకుగా అడుగులు వేస్తున్నారు. బీసీజీ ఇండియా ప్రకారం.. జనరేషన్ Z జనాభా ప్రభావం ఎంపిక చేసిన విభాగాలకు మాత్రమే పరిమితం కాదు. ఫ్యాషన్, ఫుడ్ నుంచి ఆటో మొబైల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వరకు అన్నింటిపైనా ఈ తరం ప్రభావం చూపుతోంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular