Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. చంద్రబాబు

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. చంద్రబాబు

Chandrababu Naidu in AP Assembly
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధానిప్రాంతానికి చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.  రైతులకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మద్దతును ప్రకటించింది. మందడంలో రైతుల పోరాటానికి చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్తున్న చంద్రబాబు దీక్షా శిబిరం వద్ద ఆగి రైతుల్ని పరామర్శించారు. రైతులు ఏకాకి కారని, అమరావతి రైతులకు ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు. రైతుల పోరాటం వృధా కాదని తెలిపారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ఫలిస్తోందని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం ఎవరితరం కాదని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం మంచిది కాదని అన్నారు.
Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version