YSRCP: ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం, తర్వాత సాయి కృష్ణ ఉదంతం, ఇప్పుడు జోసెఫ్ రావణ అరెస్ట్, మధ్యలో రఘురామకృష్ణంరాజు వివాదం.. ఇవన్నీ చూస్తే కచ్చితంగా రాజకీయ ప్రేరేపితం అనేది కనిపిస్తోంది. అయితే 2014 నుంచి 2019 మధ్య ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. అప్పట్లో చాలా ప్రభావం చూపాయి. అప్పటి టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చేందుకు కారణం అయ్యాయి. ఇప్పుడు కూడా అటువంటి ఘటనలే జరుగుతుండడంతో.. కూటమి ప్రభుత్వంపై ఆ ప్రభావం పడుతుందా అనే అనుమానం కలగక మానదు. అయితే అప్పట్లో జరిగిన ప్రచారానికి.. ఇప్పట్లో జరిగిన ప్రచారానికి ఒక తేడా ఉంది. అప్పట్లో టిడిపి అధికారంలో ఉంది. బలమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో ఇలా వచ్చిన ప్రజా పోరాటాల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది బహిరంగ రహస్యం. కానీ ప్రజలు దానిని పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పట్లో వైసిపి బలమైన ప్రతిపక్షం కాదా ఇంకా అధికారం ఒక్కసారి కూడా చేపట్టకపోవడం ఆ పార్టీకి కలిసి వచ్చిన అంశం.
* ప్రజా పోరాటాలు లేకుండా..
అయితే ఇప్పుడు వరుసగా జరుగుతున్న పరిణామాల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్నది ప్రధాన అనుమానం. అందుకు తగ్గట్టుగానే ఉంది ఆ పార్టీ వ్యవహార శైలి. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్దగా ప్రజా పోరాటాలు చేసింది లేదు. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తోందన్న ప్రచారం బలపడుతోంది. గతంలో కూడా వైసిపి ఇటువంటివి చేయడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. అందుకే ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడం లేదు.
* ఇప్పుడు వ్యూహంతో..
అప్పట్లో చంద్రబాబు ఒక్కరే ఉండేవారు. ముఖ్యమంత్రిగా ఉండడంతో అటు పాలనతో పాటు ఇటు రాజకీయాలు చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పై ఉండేది. పార్టీని కూడా మోసేవారు లేకుండా పోయారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరోవైపు టిడిపి బాధ్యతలను చూస్తున్నారు లోకేష్. రాజకీయంగా కూటమికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నారు. లోకేష్ సైతం యాక్టివ్ అయి తన పని తాలు చేస్తున్నారు టీం వర్క్ తో. అయితే ఇప్పుడు మతపరమైన అంశాల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న అనుమానాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇది అంతిమంగా పార్టీకే నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మత ముద్ర అనేది అంత ఈజీ కాదు. పైగా ఏపీలో హిందుత్వవాదం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం కంటే.. ఆచితూచిగా తీసుకోవడమే మేలు అని శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికలు కూడా కష్టమేనని హెచ్చరిస్తున్నారు.
