spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Cockroach Remarks: రోడ్లపై దుమ్ము దులిపిన వైసీపీ కాక్రోచ్ లు!

YSRCP Cockroach Remarks: రోడ్లపై దుమ్ము దులిపిన వైసీపీ కాక్రోచ్ లు!

YSRCP Cockroach Remarks: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాక్రోచ్ తో పోల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ఏపీలో కూడా కాక్రోచ్ లు రోడ్డుపైకి వస్తాయని.. తాను కూడా ఒక కాక్రోచ్ నే అంటూ ప్రెస్ మీట్ లో ప్రకటించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమి రెండేళ్ల పాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కొంతమంది వైసీపీ నేతలు రోడ్లమీదకు వచ్చి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మరో మంత్రి సవిత పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో మొదటిగా వైసీపీ మహిళా నేత ఉషశ్రీ చరణ్ మంత్రి సవిత పై రెచ్చిపోయారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా దూకుడుగా వ్యవహరించాయి ఈ ఆందోళన కార్యక్రమంలో. జగన్మోహన్ రెడ్డి రోడ్లపైకి కాక్రోచ్లు వస్తాయని హెచ్చరించిన తరుణంలోనే ఇలా వైసిపి శ్రేణులు ఆందోళన చేయడం విశేషం.

* పూనకంలా తిట్ల దండకం
అయితే జగన్ కాక్రోచ్ అనే పేరు ప్రకటించగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పూనకం వచ్చినట్టు కనిపించింది. ఎప్పుడు సాధారణ స్థితిలో మాట్లాడే ఉషశ్రీ చరణ్ సైతం మంత్రి సవిత పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అబ్బ జాగీరా? సొంత తల్లికి అన్నం పెట్టలేని నువ్వు అన్నపూర్ణ క్యాంటీన్ పెడతావా? సొంత మామను వెన్నుపోటు పొడిచి మంత్రి పదవి దక్కించుకున్న నువ్వు జగన్ పై విమర్శలు చేస్తావా? అసలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు నువ్వెవరు? నీ స్థాయి ఏంటి? పెనుకొండలో బెల్ట్ షాపులను అనుమతులు ఇస్తూ ప్రతి లిక్కర్ బాటిల్ పై పది రూపాయలు తింటున్నావ్, తాగుతున్నావ్. అసలు నీకు సిగ్గు లేదా? నిన్ను నమ్మి నీ వెంట నడిచిన వారిని దగా చేసి నట్టేట ముంచావు. నువ్వా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది అంటూ ఉషశ్రీ సంస్కారవంతమైన భాష వాడారు.

* అనవసరంగా నోరు పారేసుకుని..
మరోవైపు కాపు టైగర్ అంబటి రాంబాబు సైతం సీఎం చంద్రబాబుపై మరోసారి నోరు పారేసుకున్నారు. గుంటూరులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చంద్రబాబును ఉద్దేశించి వాడిని ఎప్పుడో పగలేశారు అంటూ వ్యాఖ్యానించారు. ఇక మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరమ చెత్త అని… పవన్ నువ్వు ఓజి కాదు పెద్ద క్యాబేజీ అంటూ వ్యాఖ్యానించారు. అయితే నిన్న సాగిన ఆందోళన కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బరితెగించి మాట్లాడారు. దీంతో జగన్ ప్రెస్మీట్లో చెప్పిన కాక్రోచ్ వీరేనా అంటూ సోషల్ మీడియాలో మిమ్స్ మొదలయ్యాయి. మొన్న మధ్యన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతి తగ్గింది అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి బూతులు మాట్లాడుతున్నారు. మాటలు వచ్చిన కాక్రోచ్ ల్లా వ్యవహరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version