Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Protest Buffalo Viral Video: వైసిపి పై రగిలిపోతున్న మూగజీవాలు.. వీడియో వైరల్!

YSRCP Protest Buffalo Viral Video: వైసిపి పై రగిలిపోతున్న మూగజీవాలు.. వీడియో వైరల్!

YSRCP Protest Buffalo Viral Video: ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో మూగజీవాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనిపై ఎన్ని రకాల విమర్శలు వచ్చినా వారు వెనక్కి తగ్గడం లేదు. అందుకే వాటికి కోపం వచ్చినట్టు ఉంది. వైసీపీ నేతలు ఒక్క తన్ను తన్ని పరుగులు అందించుకున్నాయి. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా నందిగామలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో అపశృతి జరిగింది.

* నందిగామలో అపశృతి..
నందిగామ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఇంటి నుంచి దున్నపోతుతో ర్యాలీ నిర్వహించారు. అయితే చుట్టుపక్కల జనం, వారి హడావిడి చూసిన దున్నపోతు బెదిరిపోయింది. చుట్టుపక్కల ఉన్న వారిని పొడిచి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఆర్డీవో కార్యాలయం వద్ద దున్నపోతుతో నిరసన చేపడుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో చాలామంది వైసిపి నేతలకు గాయాలయ్యాయి. అయితే ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో మూగజీవాలతో నిరసన చేపడుతుండడంపై జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

* మూగజీవాలతో నిరసన..
తిరుపతిలో మొన్న ఆ మధ్యన పెట్రోల్ డీజిల్ కొరతపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది తిరుపతిలో. అప్పట్లో టన్నుల కొద్ది ఉన్న ఆటోను దున్నపోతుపై ఉంచడంతో ఆ మూగ జీవి తీవ్ర అసౌకర్యానికి గురైంది . సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో జంతు ప్రేమికురాలు, జబర్దస్త్ యాంకర్ రేష్మి గౌతమ్ తీవ్రంగా స్పందించారు. నిర్వాహకులైన వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అక్కడకు కొద్ది రోజుల అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలపై వైసీపీ ఆందోళనలు చేపట్టింది. గాడిదలపై ఒక మోపెడ్ వాహనాన్ని పెట్టి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆ మూగ జీవికి రక్తస్రావం జరిగింది. దీనిపై సైతం నిరసన వ్యక్తం అయింది. అయితే ఇప్పుడు నందిగామ నియోజకవర్గంలో వైసిపి ఆందోళనలో దున్నపోతులు భయంతో రంకెలు వేసాయి. వాటి తన్నులకు వైసీపీ నేతలు బాధితులుగా మారారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇది కావాల్సిందే అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version