Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy : జగన్ సంచలన నిర్ణయం.. కోర్టు అనుమతితో విదేశాలకు.. అక్కడ...

YS Jagan Mohan Reddy : జగన్ సంచలన నిర్ణయం.. కోర్టు అనుమతితో విదేశాలకు.. అక్కడ నుంచి నేరుగా!

YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత జగన్( Jagan Mohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి జనాల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యారు. 2014 నుంచి 2019 మధ్య ఎలా ప్రజలతో మమేకమై పని చేశారు.. అలానే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జగన్ లండన్( London) వెళ్లేందుకు తాజాగా హైకోర్టు నుంచి అనుమతి వచ్చింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్పోర్ట్( passport) మంజూరు చేయాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 16న లండన్ లో జరగనున్న కుమార్తె గ్రాడ్యుయేషన్ డేకు జగన్ సతీ సమేతంగా హాజరుకానున్నారు. ఈనెల 11 నుంచి 25 వరకు ఆయన లండన్ లోనే ఉండనున్నారు. గతంలో విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతి కోరగా రకరకాల ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది. అయితే ఆయన విదేశాలకు వెళుతూ వెళుతూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు.

* సమూల ప్రక్షాళన
ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. కొన్ని కీలక నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చారు. చాలా జిల్లాలకు కొత్త అధ్యక్షులను సైతం నియమించారు. రీజనల్ కోఆర్డినేటర్లను( regional coordinators ) సైతం భర్తీ చేశారు. ఇప్పుడు ఏకంగా జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వెంటనే.. ఈనెల 29 నుంచి జిల్లాల పర్యటన( district Tours) ప్రారంభమయ్యేలా ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఏదైనా కారణాలతో వాయిదా పడితే మాత్రం ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి మూడో వారం నుంచి ప్రజల్లోకి వస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విదేశీ పర్యటనతో( foreign tour) అనేక రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ తన జిల్లాల పర్యటన విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు జగన్.

* పార్టీ శ్రేణులతో మమేకం
రాష్ట్రంలో 25 పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటరీ పరిధిలో వారానికి రెండు రోజులపాటు కార్యక్రమాలు ఫిక్స్ చేశారు. పార్టీ శ్రేణులతో సమీక్షలు, కార్యకర్తలతో మమేకమయ్యేలా జగన్( Jagan Mohan Reddy ) ప్లాన్ చేసుకున్నారు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, గత ఎన్నికలవేళ కేడర్ తో వచ్చిన గ్యాప్ భర్తీ చేసుకునేలా జగన్ తన జిల్లాల పర్యటనను కొనసాగించనున్నారు. ఆ రెండు రోజులు ప్రతి నియోజకవర్గంలోని నేతలతో లోటుపాట్లపై మాట్లాడుతారు జగన్. గతంలో నియోజకవర్గ సమీక్షల సమయంలో కీలక నేతల తో భేటీకి పరిమితం అయ్యేవారు. కానీ ఈసారి నేతలతో పాటు కార్యకర్తలను సైతం జగన్ పలకరించనున్నారు.

* వారానికి రెండు రోజులపాటు
25 పార్లమెంటు స్థానాల పరిధిలో వారానికి రెండు రోజులపాటు కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. అవసరం అనుకుంటే మరో రోజు అదనంగా కేటాయించేందుకు సైతం జగన్ సిద్ధపడుతున్నారు. అయితే ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు( budget sessions ) జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది స్పష్టత లేదు. కానీ ప్రజల్లోకి వెళ్లేందుకు మాత్రం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు జగన్. గతం మాదిరిగా ప్రజలతో మమేకమై పనిచేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఒకవైపు, పార్టీ బలోపేతం మరోవైపు అన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper