spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Members Who Did Not Come To The Assembly: అసెంబ్లీకి రాని వైసీపీ...

YCP Members Who Did Not Come To The Assembly: అసెంబ్లీకి రాని వైసీపీ సభ్యులు.. జగన్ ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు..?

YCP Members Who Did Not Come To The Assembly: ఐదేళ్లు అధికారంలో కొనసాగిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.. మరోసారి ప్రతిపక్షంలో కూర్చున్నారు. కానీ.. ప్రతిపక్ష నేతగా ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత సరిగా నిర్వర్తించడం లేదన్న కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ప్రతిపక్ష సీట్లో కూర్చున్న ఆయన అసెంబ్లీలో ప్రజల తరఫున వాయిస్ వినిపించాల్సి ఉంది. కానీ.. ఆయన మాత్రం అసెంబ్లీకి వెళ్లడం లేదు. ప్రజలు మాత్రం అసెంబ్లీలో ఆయన వాయిస్ వినాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. శాసనమండలిలో కొంత మంది నేతలు మాట్లాడుతన్నప్పటికీ అది ప్రజల్లోకి చేరడం లేదు. అదే జగన్ కనుక అసెంబ్లీలో నిలబడి మాట్లాడితే దానికి వచ్చే మైలేజీ మరొలా ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తన్నాయి. తమకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం పక్కన పెడితే.. ప్రభుత్వంపై ఎంత వరకు పోరాడగలడని అన్నదే ప్రధానం. అయితే.. ఈ విషయం జగన్‌కు ఎందుకు అర్థం కావడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

టీడీపీ కూటమి ఇటీవల అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే.. అందులోని లోటుపాట్లను అసెంబ్లీ వేదికగా బయట పెట్టాల్సిన జగన్.. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా ముఖంగా బడ్జెట్ లోపాలను వివరించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో నిలదీస్తే చాలా వరకు మైలేజీ వచ్చేది. మీడియా ముఖంగా మాట్లాడితే అది జనాలకు రీచ్ కాలేదని అంటున్నారు. అసెంబ్లీని కాదనుకొని జగన్ మీడియా సమావేశాన్ని నమ్ముకోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఆరు నెలల క్రితమే కూటమి అధికారం చేపట్టింది. అసెంబ్లీకి జగన్ రావాలంటూ కోరుతూనే ఉంది. కానీ.. ఆయన మాత్రం అలిగి ఇంట్లో కూర్చున్నాడని అంటున్నారు. దాంతో వైసీపీ మీద వ్యతిరేకత మరింత పెరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. జగన్ కోసం టీడీపీ, జనసేనల మీదనా ప్రజల మీదనా అన్న అనుమానాలు వచ్చే ప్రమాదాలూ ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

2014లో వైసీపీని పక్కన పెట్టిన జనాలే.. 2019లో అధికారాన్ని కట్టబెట్టారు. నాడు.. వైసీపీ కూడా సభకు వెళ్లి టీడీపీని నిలదీసింది. ఓ స్థాయిలో ఆడేసుకున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీశారు. దాంతో పెద్ద స్థాయిలో ఆయనకు ప్రజల్లో మైలేజీ వచ్చింది. ఇప్పుడు మరోసారి టీడీపీ కూటమి అధికారం చేపట్టింది. కానీ.. వైసీపీ నేతలు మాత్రం ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చోవడం వల్ల మరింత వ్యతిరేకత వచ్చే చాన్స్ లేకపోలేదు. ఈ నెల 22తో బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. మళ్లీ 2025 వరకూ వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉండదు. కొత్త బడ్జెట్ పెడితే ఆ సమయంలో మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ ఎందుకు వినియోగించుకోలేకపోతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త ఏడాది బడ్జెట్ సమావేశాలకు అయినా జగన్ హాజరు అవుతారా అనేది అనుమానంగానే ఉంది. కానీ.. జగన్, ఆయన ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని బడ్జెట్ సమావేశాల కోసం అసెంబ్లీకి వస్తేనే ప్లస్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీకి వచ్చి పోరాడితేనే ప్రజల్లో పార్టీకి మైలేజీ పెరుగుతుందనే విషయాన్ని జగన్ సైతం ఎందుకు గుర్తించలేకపోతున్నారా అనేది అర్థం కాకుండా ఉంది. భవిష్యత్తులో అయినా జగన్ వీటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది వేచిచూడాలి మరి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper