YCP cockroaches: ప్రస్తుతం దేశంలో కాక్రోచ్ కేంద్రంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారుతుంది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కి సంబంధించి పరీక్షల రద్దు కారణంగా కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇది కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. అయితే ఏపీలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాక్రోచ్ పార్టీతో పోల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏడాది కిందట జరిగిన డీఎస్సీ నియామకాల కు సంబంధించి అవకతవకులు చోటు చేసుకున్నాయి అనేది వైసిపి వాదన. నిన్ననే రెండు గంటలపాటు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ పై మరోసారి విషం చిమ్మారు. ఏపీలో కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాక్రోచ్లు రోడ్డుపైకి వస్తాయని తేల్చి చెప్పారు.
ఆ రెండు పార్టీలను మాత్రమే..
అయితే ఏపీలో పుట్టుకొచ్చే కాక్రోచ్లు కేవలం టిడిపి తో పాటు జనసేనను మాత్రమే టార్గెట్ చేస్తాయి. బిజెపిని మాత్రం ఏమీ చేయవు. ఎందుకంటే జగన్ చెప్పే కాక్రోచ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అంటే చాలా భయం అంతకుమించి భక్తి. నీట్ పేపర్ లీక్ మీద కనీసం నోరు తెరవలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నీట్ పరీక్ష రద్దు తో ఏపీలో చాలామంది విద్యార్థులు నష్టపోగా.. వారి గురించి కనీసం ప్రస్తావించే సాహసం కూడా చేయడం లేదు వైసిపి. మరి అటువంటి జగన్ తన పార్టీని కాక్రోచ్తో పోల్చుకోవడం ఏమిటి అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
బిజెపి విరుగుడు మంత్రం..
జగన్ చెప్పే కాక్రోచ్లు ఏపీలో బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేయగలవా? ఎందుకంటే బిజెపి వద్ద జగన్ అక్రమస్తుల కేసులకు సంబంధించి HIT అనే కాక్రోచ్ల నియంత్రణకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ఉంది. అందుకే వైసిపి కాక్రోచ్లు కేంద్రంలో ఉన్న బిజెపిపై కన్నెర్ర చేయలేవు. నోరు తెరిచి ఆరోపణలు చేయలేవు. అందుకే కేంద్రం పై దండయాత్ర ప్రారంభించిన కాక్రోచ్లు ఎక్కడ.. వైసిపి కాక్రోచ్లు ఎక్కడా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నిన్ననే మీడియా ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్ల రూపంలో సోషల్ మీడియా యాక్టివిస్టులకు గొప్ప కామెడీ వరం చూపించారు.

