Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy Liquor Scam: విజయసాయిరెడ్డి అరెస్టు తప్పదా?

Vijayasai Reddy Liquor Scam: విజయసాయిరెడ్డి అరెస్టు తప్పదా?

Vijayasai Reddy Liquor Scam: మద్యం కుంభకోణం( liquor scam) కేసులో విజయసాయిరెడ్డి ని ఏం చేస్తారు? అరెస్టు చేస్తారా? లేకుంటే విడిచి పెడతారా? ఈ కేసులో ఆయన ఏ 4 నిందితుడిగా ఉన్నారు. పలుమార్లు ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే మొన్ననే విచారణకు పిలిచింది సిట్. అయితే తనకు పది రోజులపాటు పని ఉందని.. తరువాత హాజరవుతానని సమాచారం ఇచ్చారు విజయసాయిరెడ్డి. అయితే అరెస్టు భయంతోనే విజయసాయిరెడ్డి అలా సమయం అడిగారన్న ప్రచారం సాగుతోంది. మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలు పూర్తిగా సిట్ కు చిక్కాయి. దీంతో విచారణ పేరుత పిలిచి తనను అరెస్టు చేస్తారన్న భయం సాయి రెడ్డి కి వెంటాడుతోందన్న టాక్ వినిపించింది. ఆ కారణంగానే పది రోజులపాటు సమయం అడిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

* కేసులో కీలక ఆధారాలు వెల్లడి..
అప్పుడెప్పుడో కాకినాడ పోర్టు ( Kakinada Port) కేసులో విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. అయితే తనకు ఏ పాపమూ తెలియదని.. మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవం అని.. హైదరాబాదులో సిట్టింగులు కూడా జరిగాయని.. తాను కూడా ఉన్నానని.. అయితే ఆ కేసుతో తనకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. అవసరం అనుకుంటే తన వద్ద ఉన్న ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇస్తానని చెప్పారు. సిట్ సైతం ఆయనను రెండుసార్లు పిలిచి వివరాలు సేకరించింది. అయితే అప్పట్లో కేవలం సాక్షిగానే ఆయనను పిలిచినట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి సైతం ఎటువంటి అరెస్టు భయం లేకుండా ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. ఆ రెండు సార్లు కూడా విచారణ అనంతరం నేరుగా మీడియా ముందు మాట్లాడారు. చాలా విషయాలను కూడా వెల్లడించారు. అటు తరువాత జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు విజయసాయి రెడ్డి పై విమర్శలకు దిగారు. అయితే తాను జగన్ మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించనని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి.

* సీనియర్ల సలహాతో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నుంచి విజయసాయి రెడ్డికి పిలుపు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. జగన్మోహన్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో విజయసాయిరెడ్డిని పార్టీలోకి తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని.. అందుకే ఆయనను పిలవాలని కోరినట్లు సమాచారం. అందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీనియర్లు విజయసాయి రెడ్డికి వర్తమానం ఇచ్చారని తెలుస్తోంది. ఇటువంటి ప్రచారం జరుగుతున్న సమయంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి నోటీసులో అందుకున్నారు విజయసాయిరెడ్డి. విచారణకు ఫలానా రోజు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తనకు పది రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరారు. అప్పుడు మాత్రమే వచ్చి కలుస్తానని చెప్పారు. అయితే అరెస్టు భయంతోనే విజయసాయిరెడ్డి పది రోజుల సమయం అడిగారని ప్రచారం నడుస్తోంది. తనకున్న పరపతి ద్వారా అరెస్టు జరగకుండా చేసుకునేందుకే అలా చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

* రీ ఎంట్రీ సమయంలో..
కొద్ది నెలల కిందట విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాను ఏ పార్టీలో చేరనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ అదే పనిగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించనని సాయి రెడ్డి తేల్చి చెప్పారు. అదే సమయంలో మద్యం కుంభకోణం కేసులో ఇతర నిందితుల మాదిరిగా.. సాయి రెడ్డి పై సిట్ దూకుడుగా లేదు. అంటే జగన్ పట్ల విజయసాయి రెడ్డికి గౌరవం ఉంది. అదే సమయంలో విజయసాయిరెడ్డి అరెస్టు జరగకుండా కూటమి ప్రభుత్వం కాపాడుతోందన్న టాక్ ఉంది. కానీ ఇప్పుడు వైసీపీలోకి సాయిరెడ్డి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం నడిచింది. అదే సమయంలో సిట్ నుంచి పిలుపు వచ్చింది. అంటే విజయసాయిరెడ్డి అరెస్టు తప్పదన్న వచ్చినట్టే కదా. చూడాలి ఎటువంటి మలుపులు తిప్పుతుందో ఈ మద్యం కుంభకోణం కేసు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version