Nara Lokesh Success Story: ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఒక గోడ కట్టినట్టు.. వైఫల్యాలు.. అవమానాలు ఎదురైనా సరే.. విసిరిన రాళ్లతో రాచబాటను మలుచుకున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్.. తండ్రి రాజకీయాల్లో దురంధరుడు అయినా ఆయన చోటును తీసుకోకుండా.. దమ్మున్న నాయకుడిగా బరిలో నిలిచాడు. ఓడిపోయి అవమానాలు పడ్డ నియోజకవర్గాన్ని వదలలేదు.. వెన్ను చూపని వీరుడి వలే నిలబడ్డాడు. ఆ మొండితనం.. ఆ పట్టుదలనే అతడిని విజయతీరాలకు చేర్చింది.. ఇప్పుడు మోడీ సహా దేశం అభిమానించే నేతగా మలిచింది..
రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక మెట్టు మాత్రమే, కానీ గమ్యం కాదు. చాలా మంది నాయకులు తమ తండ్రి సంపాదించిన కంచుకోటల నుంచి పోటీ చేసి సులువుగా గెలుస్తుంటారు. రాహుల్ గాంధీ గారు తన కుటుంబానికి పట్టున్న చోట నుంచే పోటీ చేశారు. అటు వైఎస్ జగన్ గారు కూడా తన తండ్రి వైఎస్ఆర్ గారికి కంచుకోట లాంటి పులివెందుల నుంచే బరిలోకి దిగారు. కానీ నారా లోకేష్ ఇందుకు పూర్తి భిన్నం.
సవాలును స్వీకరించిన క్షణం
2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి ఎదురైనప్పుడు చాలా మంది విమర్శించారు. “లోకేష్ వేరే సురక్షితమైన నియోజకవర్గానికి వెళ్లిపోతారు” అని ప్రచారం చేశారు. కానీ లోకేష్ గారు పారిపోలేదు. “ఎక్కడైతే ఓడిపోయానో.. అక్కడే జెండా పాతతాను” అని మంగళగిరినే తన కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. అది తెలుగుదేశం పార్టీకి ఎంతో కాలంగా అందని ద్రాక్షలా ఉన్న నియోజకవర్గం. అయినప్పటికీ, ఆయన అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయాలని నిర్ణయించుకున్నారు.
యువగళం: ఒక జన గర్జన
ప్రజల కష్టాలను స్వయంగా చూడాలని, వారి గొంతుకగా మారాలని ‘యువగళం’ పాదయాత్ర చేపట్టారు. ఎండనక, వాననక వేల కిలోమీటర్లు నడిచారు. ఆ యాత్రలో ఆయన చూసింది కేవలం జనాన్ని కాదు, యువత ఆవేదనను, మహిళల ఆత్మగౌరవాన్ని, రైతుల కన్నీళ్లను. ఆ పాదయాత్రే లోకేష్ను ఒక పరిపూర్ణ నాయకుడిగా తీర్చిదిద్దింది.
లక్ష్యం.. నవ్యాంధ్ర అభివృద్ధి
లోకేష్ గారి విజన్ కేవలం అధికారం కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. 20 లక్షల ఉద్యోగాలతో రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడమే ఆయన ప్రధాన ధ్యేయం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పారిశ్రామిక వేత్తలను ఆకర్షించి, రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్గా మార్చడం. అంబేద్కర్ ఆశయాలతో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజాస్వామ్య విలువలని కాపాడుతూ పాలన సాగించడం. ఇదే ఆయనను సుపరిపాలకుడిగా రాష్ట్రప్రజల్లో నిలబెట్టింది.
నేడు మంగళగిరిలో లోకేష్ సాధించిన విజయం కేవలం ఒక ఎన్నికల గెలుపు మాత్రమే కాదు.. అది ఆయన పట్టుదలకు, శ్రమకు దక్కిన ఫలితం. చరిత్రలో ఒకరి వారసుడిగా అడుగుపెట్టి, తన సొంత ముద్రతో ‘చరిత్రను తిరగరాసిన యోధుడు’ గా నేడు ఆయన నిలబడ్డారు.
“కష్టాలు ఎదురైనప్పుడు వెనకడుగు వేసేవాడు సామాన్యుడు.. ఆ కష్టాలనే మెట్లుగా మార్చుకొని శిఖరాన్ని చేరుకునేవాడు నాయకుడు.” అందుకు ఉదాహరణే మన నారా లోకేష్