Homeఆంధ్రప్రదేశ్‌Liquor Scam In AP: మద్యం కుంభకోణంలో సిట్ ప్రకంపనలు!

Liquor Scam In AP: మద్యం కుంభకోణంలో సిట్ ప్రకంపనలు!

Liquor Scam In AP: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపింది. ఇప్పటివరకు పాత్రధారులు మాత్రమే అరెస్టు అయ్యారు. అసలు సూత్రధారి పేరు బయటకు రావడం లేదు. అయితే స్పష్టమైన ఆధారాలు దొరికాయి కానీ.. కొన్ని రకాల కారణాలతో విడిచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చూస్తుంటే మాత్రం వచ్చే ఎన్నికల వరకు మద్యం కుంభకోణం అలానే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో పట్టుబడిన నిందితులు మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన ఆస్తులు అటాచ్ అవుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు అటాచ్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరే కాదు ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి నిందితుడి ఆస్తులు అటాచ్ అవుతుండడం విశేషం. అయితే వారి వ్యక్తిగత ఆస్తుల జోలికి పోవడం లేదు. కేవలం మద్యం కుంభకోణంలో కమీషన్ల రూపంలో వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిని మాత్రమే అటాచ్ చేస్తున్నారు. కేవలం కమిషన్ల రూపంలో వందల కోట్లు వస్తే.. మరి అసలు సూత్రధారి కి ఎంత చేరిందో అర్థం అవుతుంది. అందుకే ఈ కేసు మరింత లోతుగా కొనసాగితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే.

* ఆస్తుల అటాచ్..
ఈ కేసులో అప్పటి సీఎం ఓ అధికారి ధనంజయ రెడ్డి( Dhananjay Reddy ), ఆపై జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్టయ్యారు. ఇందులో కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. తాజాగా ఆయన ఆస్తులను సైతం అటాచ్ చేసింది. త్వరలో ధనుంజయ రెడ్డి ఆస్తులు సైతం అటాచ్ అవుతాయని సమాచారం. కేవలం ఆస్తులుగానే కాదు బంగారం, ఇతరత్రా బహుమతుల రూపంలో సైతం కమీషన్లు దండుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపితే కుంభకోణం ఏమి ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా తీసుకుంది. అనుకూల మీడియాతో పాటు విశ్లేషకులు సైతం అలానే చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆస్తుల అటాచ్ చూస్తుంటే మాత్రం పరిస్థితి చేయి దాటుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనతో ఉంది.

* లోతైన దర్యాప్తు..
ఎవరు అవునన్నా కాదన్నా అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మద్యం కుంభకోణంలో( liquor scam) అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టు పెట్టిన ప్రతిసారి అంతిమ లబ్ధిదారుడి పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతానికి చుట్టూ గొయ్యిని తవ్వారు. చివరకు కచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చనున్నారు. అయితే మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించగలిగారంటే దర్యాప్తు ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం అవుతోంది. కచ్చితంగా అంతిమ లబ్ధిదారుడికి ఎంత చేరింది? ఎలా చేరింది? ఎవరి ద్వారా చేరింది? అనేది కూడా దర్యాప్తు బృందం ఇప్పటికే గుర్తించగలిగి ఉంటుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper