Kandula Durgesh tourism reforms: కూటమి ప్రభుత్వం లో జనసేన పార్టీ తన మార్క్ పాలన ని చూపిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖలో సృష్టిస్తున్న అద్భుతాలు చూస్తూనే ఉన్నాం. 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వకముందే, ఈ శాఖని దేశం లోనే నెంబర్ 1 గా నిలిపి , 19 నేషనల్ అవార్డ్స్ ని దక్కించేలా చేశాడు, ఇది నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో గర్వకారణమైన విషయం. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు , ఆ పార్టీ కి ఇచ్చిన మిగతా మంత్రిత్వ శాఖలు కూడా బలంగా పని చేస్తున్నాయి , సమాజం లో మార్పులు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా టూరిజం శాఖని అభివృద్ధి చేయడం కోసం కందుల దుర్గేష్ అహర్నిశలు కృషి చేస్తున్నాడు.
రీసెంట్ గానే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖకు 8 టూరిజం ప్రాజెక్ట్స్ కి గానూ 428 కోట్ల రూపాయిలు కేటాయించింది. ఈ నిధులతో సూర్యలంక బీచ్ , బొర్రా కేవ్స్ , అఖండ గోదావరి, గండికోట , అన్నవరం , సింహాచలం, అహోబిలం , శ్రీ క్షేత్ర అహోబిలం ప్రాంతాలను అభివృద్ధి చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో కందుల దుర్గేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పవన్ కళ్యాణ్ తన శాఖల మీద మాత్రమే కాకుండా, ఇతర శాఖల మీద కూడా ద్రుష్టి పెట్టడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని, రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ పాలనలో తన అద్భుతమైన మార్కుని చూపించి , తమ శాఖలను దేశం లోనే ది బెస్ట్ గా నిలుపుతారని సోషల్ మీడియా లో అభిమానులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ అంశం పై సోషల్ మీడియా లో జనసేన , తెలుగు దేశం పార్టీ అభిమానుల మధ్య గొడవలు చెలరేగేలా చేశాయి. తెలుగు దేశం పార్టీ హ్యాండిల్ నుండి శుభాకాంక్షలు తెలుపుతూ , టూరిజం శాఖకు సంబంధించిన కందుల దుర్గేష్ ని కాకుండా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ని ఫోటో లో చేర్చడం పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
