Jagan Mohan Reddy: రాష్ట్ర రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిన్ననే మావిగన్ రాజధాని అంటూ తేల్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఒక్కరోజు గడవకముందే ఇప్పుడు అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ తేల్చి చెప్పారు. నిన్ననే మీడియా ముందుకు వచ్చి మావిగన్ అజెండాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించారు. అదే మీడియా సమావేశంలో విశాఖ పరిస్థితి ఏంటి అని జర్నలిస్టులు అడిగితే సమాధానమివ్వకుండా జారుకున్నారు. అందుకే సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. మళ్లీ ఈరోజు మరోసారి నోరు జారి వారికి అడ్డంగా దొరికిపోయారు జగన్. వాస్తవానికి మన రాజధాని అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ జగన్ చేసిన తాజా కామెంట్లకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
* పరామర్శ చేసిన క్రమంలో..
తాజాగా మరో పరామర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు వేధింపులతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ క్రాంతి కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. విజయవాడలో ఆయన కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్ టు రాజధానిలో జరుగుతోందని జగనన్నారు. చంద్రబాబు కూడా పక్కనే ఉంటారని.. అమరావతి కాదు మన రాజధాని.. సో కాల్డ్.. వాస్తవం చెప్పాలంటే విజయవాడ మన రాజధాని అని జగన్ చెప్పారు. కళ్లెదుటే పోలీస్ స్టేషన్, సిపి కార్యాలయం, డిజిపి ఆఫీస్, హోం మంత్రి ఆఫీస్.. సీఎం అందరం ఇక్కడే ఉంటామని అన్నారు.
* ఒక్క రోజులోనే మారిన మాట..
వాస్తవానికి జగన్ సో కాల్డ్ రాజధాని అమరావతి అని చెబుతూనే విజయవాడ మన రాజధాని అని అన్నారు. అంటే అమరావతి సో కాల్డ్ రాజధాని అయినప్పుడు.. విజయవాడ కూడా సో కాల్డ్ రాజధాని అన్న ఉద్దేశంతో జగన్ ఆ కామెంట్స్ చేసి ఉండవచ్చు. కానీ ఇలా పూటకో సారి రాజధాని విషయంలో జగన్ మాట మారుస్తుండడంతో.. రాజధాని విషయంపై జగన్కు క్లారిటీ లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూటర్న్ లపై నెటిజెన్లు మీమ్స్ పండుగ చేసుకుంటున్నారు.

