YCP: వైసిపి ధీమా ప్రకటనల వెనుక కారణం అదా?

గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఏకపక్షం విజయం వైసిపికి దక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం జైత్రయాత్ర కొనసాగింది.

Written By: Dharma, Updated On : May 24, 2024 5:13 pm

YCP

Follow us on

YCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకమే. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ గట్టి ప్రయత్నమే చేశారు. జగన్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు చంద్రబాబు సైతం అదే తరహా ప్రయత్నం చేశారు. జనసేన, బిజెపితో కూటమి కట్టారు. గట్టి పోటీ ఇచ్చారు. వ్యవస్థలపరంగా కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందగలిగారు. అటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో గెలుపు కూటమిదేనన్న అంచనాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఒక ప్రకటన చేశారు. గత ఎన్నికల కంటే ఒక సీటు అదనంగా వస్తుందని కూడా తేల్చి చెప్పారు. అప్పటినుంచి ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

అయితే జగన్ ప్రకటనను సొంత పార్టీ నేతలే విశ్వసించడం లేదు.గెలుపుపై చాలామంది అప నమ్మకంతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో గెలుపు పై మాట్లాడేందుకు కూడా వైసిపి నేతలు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగి పది రోజులు దాటిన తర్వాత.. వైసీపీ నేతలు వరుస ప్రకటనలు చేస్తున్నారు. గెలుపు పై కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు. ఇది చర్చకు దారితీస్తోంది. ఇన్ని రోజులు మౌనం పాటించి సడన్ గా వారు మాట్లాడడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ పరిణామంపై ఆ పార్టీ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఏకపక్షం విజయం వైసిపికి దక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం జైత్రయాత్ర కొనసాగింది. ఉప ఎన్నికల్లో సైతం వార్ వన్ సైడే నన్న రీతిలో వ్యవహారం నడిచింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. పోలింగ్ సరళిని చూసి వైసిపి శ్రేణులు కూడా ఆందోళన చెందాయి. కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించాయి. దీంతో వైసిపి పని అయిపోయిందన్న ప్రచారం ప్రారంభమైంది. పార్టీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన భయం కనిపిస్తోంది. వైసీపీ విషయంలో అధికారుల స్వరం కూడా మారింది. ఈ పరిణామాలన్నీ వైసీపీ నాయకత్వంలో భయానికి కారణమవుతున్నాయి. ఇలానే కొనసాగితే అధికార యంత్రాంగంలో పట్టు కోల్పోతామని, కౌంటింగ్ నాడు ఏజెంట్లు సైతం భయపడతారని, విపక్షాలు రెచ్చిపోయే అవకాశం ఉందని.. ఈ కారణాలతోనే ఇప్పుడు వైసీపీ నేతలు ధైర్యం ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.