Homeఆంధ్రప్రదేశ్‌Greater Visakha : నిజంగా 'గ్రేట్'ర్ విశాఖ.. కార్పొరేటర్లకు మస్త్ మజా!

Greater Visakha : నిజంగా ‘గ్రేట్’ర్ విశాఖ.. కార్పొరేటర్లకు మస్త్ మజా!

Greater Visakha : సాధారణంగా విదేశాలకు వెళ్లి విడిది చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ అది ఖరీదైన అంశం. చేతిలో లక్షలు లేనిదే విదేశీ ప్రయాణం జరపలేం. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఇప్పుడు విదేశాలకు వెళ్లిపోయారు విశాఖ కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లు. మేయర్ గొలగాని వెంకట హరి కుమారి పై( mayor golagani Venkata Hari Kumari ) అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో పాలకపక్షం తో పాటు ప్రతిపక్షం సభ్యులను విదేశాలకు తరలించడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఎమ్మెల్యేలను పక్క రాష్ట్రాలకు తరలించడం చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా విదేశాలకు కార్పొరేటర్లను తరలించడం మాత్రం నిజంగా విశేషమే. అనుకొని అవకాశం రావడంతో కార్పొరేటర్లు విదేశాల్లో సేద తీరుతున్నారు.

Also Read : జగన్ ను ప్రశ్నించిన ఎస్ఐ ఫొటోలు.. వైరల్

* రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్..
గ్రేటర్ విశాఖ( greater Visakha).. నవ్యాంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరపాలక సంస్థ. దాదాపు పది నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది గ్రేటర్ విశాఖ. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలు, భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి పరిధిలో విస్తరించి ఉంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ పీఠాన్ని సొంతం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 58 డివిజన్లను గెలుచుకొని గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అతి పెద్దదైన గ్రేటర్ విశాఖ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూటమి భావిస్తోంది.

* పెరిగిన కూటమి బలం..
అయితే ఎన్నికలకు ముందు, ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి బలం 70కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో కూటమి నేతలు విశాఖ జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానంపై వినతి పత్రం అందించారు. ఆయన ఈనెల 19న అవిశ్వాస తీర్మానం కి సంబంధించి ఓటింగ్ ను ప్రకటించారు. అయితే కూటమి పక్కా వ్యూహంతో వెళ్తోంది. దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత విషాదంలో మునిగిపోవడం ఖాయం. అందుకే సీనియర్లుగా ఉన్న బొత్స, ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు రంగంలోకి దిగారు. తమ పార్టీ కార్పొరేటర్ లను బెంగళూరు శిబిరానికి తరలించారు.

* ముందే జాగ్రత్త పడిన కూటమి..
అయితే గత అనుభవాల దృష్ట్యా కూటమి ముందే జాగ్రత్తలు తీసుకుంది. అందుకే తమ వైపు వచ్చిన కార్పొరేటర్లతో సహా టిడిపి సభ్యులను విదేశాలకు తరలించింది. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో( Indian political history) ఓ నగరపాలక సంస్థ కార్పొరేటర్ లను ఇలా విదేశీ శిబిరాలకు తరలించడం ఇదే తొలిసారి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సైతం ఇదే తరహా డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. తమకు సైతం విదేశాలకు తరలించాలని వారు కోరడంతో వైసిపి హై కమాండ్ స్పందించింది. మలేషియా కు తరలించినట్లు తెలుస్తోంది. ఈనెల 19న విదేశాల్లో ఉన్న ఇరు పార్టీల కార్పొరేటర్లు నేరుగా అవిశ్వాస తీర్మాన ఓటింగ్ కు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

Also Read : పవన్‌ లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యారు.. ఆయన సీరియస్‌ పొలిటీషియన్‌ కాదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
Oktelugu Epaper
Exit mobile version