Homeఆంధ్రప్రదేశ్‌Posani Krishna Murali: పోసానికి ఉన్న ధైర్యం ఫైర్ బ్రాండ్లకు లేదా? వైసీపీలో సెటైర్లు

Posani Krishna Murali: పోసానికి ఉన్న ధైర్యం ఫైర్ బ్రాండ్లకు లేదా? వైసీపీలో సెటైర్లు

Posani Krishna Murali: నిన్నటి వరకు వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదువ లేదు.ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో.. అప్పుడే ఈ ఫైర్ బ్రాండ్ అంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. కొందరు చెన్నై వెళ్లిపోయారు. మరికొందరు బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఇంకొందరు అయితే అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఫైర్ బ్రాండ్లకు ఇప్పుడు అరెస్టుల భయం కొనసాగుతోంది.ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ,అనిల్ కుమార్ యాదవ్, రోజా లాంటి వారు అస్సలు కనిపించడం లేదు. వైసిపి అధికార ప్రతినిధిగా నియమితులు కావడంతో అడపాదడపా రోజా కనిపిస్తున్నారు. అయితే ఆమె లైవ్లో కనిపించడం లేదు. వీడియోలు విడుదల చేసి సందడి చేస్తున్నారు. కనీసం ప్రెస్ మీట్ లు కూడా పెట్టడం లేదు. ఎక్కడో చెన్నై నుంచి రికార్డింగ్ వీడియోలు ఏపీ మీడియాకు అందించి చేతులు దులుపుకుంటున్నారు. కొడాలి నాని అంటే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కనీసం మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. వల్లభనేని వంశీ ఇక్కడ ఉన్నారో? అమెరికా వెళ్ళిపోయారు?తెలియని పరిస్థితి.అనిల్ కుమార్ యాదవ్ అయితే అస్సలు కనిపించడం లేదు. చెన్నైలో పూర్తిగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ నెల్లూరు వచ్చినా క్యాడర్ కు సమాచారం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అరెస్టుల పర్వం నడుస్తోంది. దానికి భయపడి వీరంతా రాష్ట్రానికి రావడం లేదన్న చర్చ ప్రారంభం అయ్యింది.

* అనిల్ పై చర్చ
ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ విషయంలో బలమైన చర్చ నడుస్తోంది. మిగతా నేతల కంటే అనిల్ ది భిన్న వైఖరి. గత ఐదేళ్ల కాలంలో చిన్న పిల్లాడి మాదిరిగా వ్యవహరించారు. చిల్లర పనులు చేసేవారు. వైసిపి మార్కు అరాచకానికి, చిల్లర పనులకు పెట్టింది పేరు. అసెంబ్లీలో తొడలు కొట్టడం, జిప్పులు తీయడం వంటి పనులు చేసి ప్రజల మధ్యన చులకన అయ్యారు. ఓవరాక్షన్ లీడర్ గా గుర్తింపు పొందారు. అందుకే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. నెల్లూరు అంటే తనదేనని వ్యవహరించారు. కానీ అక్కడ నెల్లూరు పెద్దారెడ్డి ఉంటారన్న విషయాన్ని మరిచిపోయారు. ఇప్పుడు నెల్లూరు అంటేనే రావడానికి భయపడిపోతున్నారు.

* ధైర్యంగా ముందుకు వస్తున్న పోసాని
అయితే వైసీపీ నేతలు బయటకు వచ్చి మాట్లాడేందుకు చాలా రకాలుగా భయపడుతున్నారు. ఏ కేసు ఎటు వెంటాడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కానీ పోసాని కృష్ణ మురళి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆయనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. పాత కేసులు తెరపైకి వస్తున్నాయి. అయినా సరే ఆయన భయపడడం లేదు. మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు. కనీసం పోసానికి ఉన్న ధైర్యం.. వైసీపీ ఫైర్ బ్రాండ్లకు లేకుండా పోయిందన్న సెటైర్లు బలంగా వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular