Homeఆంధ్రప్రదేశ్‌AP Free Bus Application: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఆ రూట్లలో ఉండదు!

AP Free Bus Application: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఆ రూట్లలో ఉండదు!

AP Free Bus Application: ఏపీలో( Andhra Pradesh) మరో ఐదు రోజుల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభం కానుంది. రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. పూర్తిగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం? ఎక్కడినుంచి ఎక్కడికి ఉచితం? ఏ గుర్తింపు కార్డు అవసరం వంటి వివరాలను స్పష్టం చేయనుంది ప్రభుత్వం. ఈనెల 15న మంగళగిరిలో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పథకం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో.. 74 శాతం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం 11,449 బస్సులు ఉండగా.. 8458 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండనుంది. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండడంతో.. రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.

Also Read: మహిళల ఉచిత ప్రయాణానికి ఓకే.. కానీ

ఐదు రకాల బస్సుల్లో ఉచితం..
ఐదు రకాల బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం( free travelling) కొనసాగనుంది. ప్రధానంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రోల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డుకు సంబంధించి ఈ రాష్ట్రానికి చెందిన వారేనని గుర్తింపు కార్డు ఉంటే చాలు మహిళలకు ఉచిత ప్రయాణం కలగనుంది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాలలో సైతం దీనిని చేర్చారు. ఇప్పుడు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంటర్ స్టేట్ ఎక్ష్ప్రెస్స్ లో నో ఛాన్స్..
అయితే ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్( interstate Express ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిస్సా వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ఘాట్ రోడ్లలో నడిచే బస్సుల్లో సైతం ఈ పథకం వర్తించదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు. ఈ బస్సుల్లో రద్దీ పెరిగితే ఘాట్ రోడ్లలో నడపడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణం ఉండదు.

Also Read:  ఉచిత బస్సు ప్రయాణం… కూటమి ప్రభుత్వానికి అదే పెద్ద మైనస్ కానుందా?

సిబ్బంది పెంపునకు చర్యలు..
మరోవైపు ఈ ఉచిత ప్రయాణ పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది. బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల కొరతను అధిగమించడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి డిపోలో రోజువారి ప్రాతిపదికన తాత్కాలిక డ్రైవర్ల సంఖ్యను పెంచుతున్నారు. ఆయా జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. అయితే ఉచిత ప్రయాణ పథకం అమలు అయితే మాత్రం ఆర్టీసీ సిబ్బందిపై భారం పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రత్యామ్నాయాల పై దృష్టిపెట్టారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular