Andhra Pradesh Gold Mines: దేశంలో ఇప్పుడు అందరి చూపు ఏపీపై ఉంది. ఎందుకంటే వరుసగా బంగారుగనులు వెలుగు చూస్తున్నాయి. మొన్ననే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఖనిజ తవ్వకాలు, ఉత్పత్తి మొదలైంది. అయితే ఇప్పుడు ఏపీలో రాయలసీమ ప్రాంతంలో భారీగా బంగారం ఖనిజం నిల్వలు ఉన్నాయని జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ భావిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున ఖనిజాన్వేషణ చేయాలని నిర్ణయించింది. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో బంగారం గని నిల్వలు ఉన్నాయన్నది ఒక అంచనా. 1.58 లక్షల హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందన్న అంచనా తో ఈ అన్వేషణ మొదలు పెడుతోంది జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్.
* మూడు దశాబ్దాల పరిశోధనలు..
కర్నూలు జిల్లాలో బంగారు గనికి సంబంధించి మూడు దశాబ్దాలకు పైగా పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు ఈ 14 ప్రాంతాల్లో నాలుగు దశల్లో అన్వేషణ చేపట్టనున్నారు. ఇక్కడి మట్టి, రాళ్లు పరిశీలించి బంగారు నిక్షేపాలు లభించేందుకు ఉండే అవకాశాన్ని నిర్ధారిస్తారు. దీనిని జియాలాజికల్ 4 దశ అంటారు. సగటున నాలుగు వందల మిల్లీమీటర్లకు ఒకటి చొప్పున బోరు హోల్స్ వేసి.. భూమి లోపల నుంచి నమూనాలు తీసి పరిశీలిస్తారు. దీనిని g3 దశగా పేర్కొంటారు. అప్పుడు సానుకూల ఫలితాలు వస్తే g2కి వస్తారు. జీ 2 లో సగటున ప్రతి 200 మీటర్ల దూరానికి ఒక బోర్ హోల్స్ వేసి అన్వేషిస్తారు. ఇది విజయవంతం అయితే కనీస లీజులు కేటాయించి.. మైనింగ్ కు వీలు కల్పిస్తారు. ఈ ప్రక్రియను జీ1 గా పేర్కొంటారు.
* ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. శ్రీ సత్య సాయి జిల్లా నంబలపూలకుంట మండలం జౌకుల గ్రామ పరిధిలో 1000 హెక్టార్ల చొప్పున ఆరు బ్లాకులుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇక్కడ ఖనిజాన్ వేసిన ప్రారంభం అయ్యింది. అలాగే రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ గనులు ఉండేవి. ఇప్పుడు వాటిని ఆనుకునే 2000 హెక్టార్లలో అన్వేషణకు గతంలో ముంబైకి చెందిన ఆంధ్ర మైనింగ్ కార్పొరేషన్ కు అనుమతి ఇచ్చారు.
* చిత్తూరు జిల్లా చిగురుకుంట, సన్నతంలో 273 హెక్టార్లలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉంటుందని గతంలో గుర్తించారు. ఇక్కడ 12,500 కేజీల బంగారం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో దీనిని కేంద్ర ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించారు. కానీ తవ్వకాలు చేయలేకపోయింది. తాజాగా దీనికి వేలం వేస్తున్నారు. మొత్తానికి అయితే ఏపీ ఇప్పుడు బంగారు గనిగా మారిపోయింది.

