spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Coalition Government: విధ్వంసం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏపీలో ఏం...

AP Coalition Government: విధ్వంసం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏపీలో ఏం చేసిందంటే..

AP Coalition Government: విధ్వంసం నుంచి వికాసం వైపు.. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఇదే మాట మాట్లాడుతున్నారు. నిజంగా రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏపీ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందిందా.. సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఒరవడి సృష్టిస్తుందా.. దీనికి క్షేత్రస్థాయిలో గణాంకాలు సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

లక్ష కోట్ల వరకు ఖర్చు

ఉదాహరణకు రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏపీలో సంక్షేమ పథకాల కోసం లక్ష కోట్ల వరకు ఖర్చు చేసింది. కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా.. అందరికీ ఈ పథకాలు అమలవుతున్నాయి.. ఉదాహరణకు అన్న క్యాంటీన్ల ను తీసుకుంటే.. ఇవి నూటికి నూరు శాతం విజయవంతమయ్యాయి. ఇప్పటివరకు 230 కోట్లను ప్రభుత్వం వీటి మీద ఖర్చుపెట్టింది. స్త్రీ శక్తి పథకం ద్వారా 71 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించారు. 2565 కోట్ల మేర లబ్ధి పొందారు.

సామాజిక పింఛన్లు

గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఎన్టీఆర్ భరోసా పేరు మీద ప్రభుత్వం సామాజిక పింఛన్లు ఇచ్చింది. 65,887 కోట్లను పేదలకు పంచింది. ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఏపీ ప్రభుత్వ పేదలు చెబుతున్నారు. దీపం పథకంలో భాగంగా 4.26 కోట్ల సిలిండర్లను పేదలకు అందించారు. దీనికోసం 3100 కోట్లను ఖర్చుపెట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి దాదాపు 8 వేల 985 కోట్లు ఖర్చు చేశారు. 46 లక్షల మంది రైతులకు భరోసా కల్పించారు. ఒక్కో రైతు ఖాతాలో 20వేల చొప్పున జమ చేశారు. ఆటో డ్రైవర్లకు 15000 చొప్పున ఇప్పటివరకు 435 కోట్లను జమ చేశారు. మత్స్యకార సేవలో భాగంగా మత్స్యకారులకు ఏడాదికి 20వేల చొప్పున కూటమి ప్రభుత్వం ఇస్తోంది. దీనికోసం 250 కోట్లు ఖర్చుపెట్టింది. తల్లికి వందనం పథకం ద్వారా 65.27 లక్షల మంది పిల్లలకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా 4-5 లక్షల మంది తల్లుల ఖాతాలో ఇప్పటివరకు పదివేల కోట్లను జమ చేసింది..

రోడ్లు వేసింది.. ఉద్యోగాలు భర్తీ చేసింది..

గ్రామీణ ప్రాంతాల్లో 2000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లను వేసింది కూటం ప్రభుత్వం. పదివేల కిలోమీటర్ల పరిధిలో తారు రోడ్లలో నిర్మించింది. ఏజెన్సీ ప్రాంతంలో వెయ్యికోట్లతో రోడ్లు నిర్మించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. అంతేకాదు పోలీస్ శాఖలో 6100 మంది ఉద్యోగులను నియమించింది. అంతేకాదు విద్యుత్ చార్జీలను ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పెంచలేదు. దీనికి తోడు ట్రూ డౌన్ ద్వారా తగ్గించడం ప్రజలకు ఊరట కల్పించింది. డీఎస్సీ ద్వారా దాదాపు 16 వేలకు పైగా టీచర్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. నాసిరకమైన మద్యానికి చరమగీతం పాడింది. అస్తవ్యస్తమైన మద్యం విధానాన్ని చెత్తబుట్టలో పడేసింది. పారదర్శకతకు పెద్దపీట వేసింది. నూతన ఎక్సైజ్ విధానానికి అమల్లోకి తెచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version