Homeఆంధ్రప్రదేశ్‌Farmer: 28 రోజులు.. 760 కిలోమీటర్లు.. ఓ రైతు ఆక్రందన.. వీడియో వైరల్

Farmer: 28 రోజులు.. 760 కిలోమీటర్లు.. ఓ రైతు ఆక్రందన.. వీడియో వైరల్

Farmer: ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 800 కిలోమీటర్లు ఎడ్ల బండి పై వచ్చాడు ఓ రైతు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా?అనంతపురం జిల్లా హిందూపురం నుంచి..ఎక్కడికి వచ్చాడో తెలుసా? మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి..ఎన్ని రోజులు ప్రయాణించాడో తెలుసా? అక్షరాలా 28 రోజులు. వినడానికి వింతగా ఉంది కదూ.కానీ ఇది వాస్తవం. దళారీ వ్యవస్థకు రైతులు నష్టపోతున్న తీరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పాలని ఓ రైతు ఇలా ఆరాటపడ్డాడు. సాగులో ఎదురవుతున్న నష్టాలను ఎదుర్కోలేక చాలామంది బలవన్మరణానికి పాల్పడుతున్న తీరును చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తన సొంత గ్రామం నుంచి ఎడ్ల బండి పై అమరావతికి బయలుదేరాడు. దాదాపు 28 రోజులపాటు ప్రయాణించి గమ్యానికి చేరుకున్నాడు. మూడు రోజుల కిందట మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నాడు. పవన్ నుంచి పిలుపు వస్తుందని పరితపించాడు. కానీ పిలుపు రాకపోవడంతో చలిలో తీవ్ర అసౌకర్యం మధ్య గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తపరిచాడు.

* రైతుల కష్టాలను వివరించేందుకు..
అనంతపురం జిల్లా పరిగి మండలం శాసనకోట కు చెందిన నవీన్ కుమార్ అనే యువరైతు.. తమ కష్టాలను వివరించేందుకు జనసేన కార్యాలయం ఎదుట మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. రైతుల సమస్యలను పవన్ కు చెప్పేందుకు హిందూపురం నుంచి ఎడ్ల బండి పై వచ్చినట్లు కార్యాలయ సిబ్బందికి తెలియజేశాడు. కార్యాలయం గేటు బయట చలికి వణుకుతూ..ఎండకు ఎండుతూ ఇబ్బంది పడుతున్నాడు. చలి తీవ్రతకు ఎద్దుల సైతం అనారోగ్యానికి గురైనట్లు చెబుతున్నాడు. తినడానికి గడ్డి కూడా లేదంటూ.. మేత ఇవ్వాలని చుట్టుపక్కల రైతులను ప్రాధేయపడుతున్నాడు. రైతు సమస్యలను చెప్పేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు.

* పవన్ తోనే సమస్యలు పరిష్కారం అవుతాయని..
రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులకు.. లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. దీంతో రైతులు పవన్ విషయంలో కొంత సానుకూలతతో ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని నాడు పవన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయానికి గిట్టుబాటుతో పాటు పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. తాజాగా ఈ యువరైతు ఆక్రందనతో రైతు సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నదాతలు సంతోషిస్తున్నారు. ఆ యువరైతుకు పవన్ ను కలిసే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఆ యువ రైతు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Oktelugu Epaper