spot_img
HomeతెలంగాణMalla Reddy viral speech: పాలమ్మిండు.. పూలమ్మిండు.. తెలంగాణలోనే అంబానీ అయ్యిండు.. మల్లారెడ్డి సార్ తోని...

Malla Reddy viral speech: పాలమ్మిండు.. పూలమ్మిండు.. తెలంగాణలోనే అంబానీ అయ్యిండు.. మల్లారెడ్డి సార్ తోని అట్లుంటది మరి..

Malla Reddy viral speech: పబ్లిక్ రిలేషన్ టీం ఉండదు. జాకీలు పెట్టి లేపడానికి పెయింట్ యూట్యూబ్ ఛానల్స్ ఉండవు. సొంతంగా మీడియా సంస్థ కూడా ఉండదు. అయినప్పటికీ మల్లారెడ్డి సార్ ఎంట్రీ ఇచ్చాడు అంటే మీడియా షేక్ అవుతుంది. సోషల్ మీడియా బద్దలవుతుంది. ఆయన మాట్లాడితే మంటలు. అడుగుపెడితే పూనకాలు.. ఇలా ఉంటుంది మల్లారెడ్డి సార్ తోని.

మల్లారెడ్డి సార్ పాలు అమ్మి.. పూలు అమ్మి.. బోర్లు వేసి ఇక్కడ దాకా వచ్చిండు. దాదాపు ఆయన ఆధ్వర్యంలో 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 500 ఎకరాలలో ఆయన విద్యాసంస్థలు ఉన్నాయి. బయటికి మాత్రమే ఇవి చెప్పిండు. చెప్పని ఆస్తులు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు.. విద్యా వ్యాపారం ద్వారా.. రాజకీయాల్లోకి రావడం ద్వారా మల్లారెడ్డి సార్ భారీగా సంపాదించిండు. ఆయన సంపాదన ఏ రేంజ్ లో ఉందంటే.. తెలంగాణలో ఎవరికి లేని ఆస్తులు ఆయనకు మాత్రమే ఉన్నాయి. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయనను అంబానీ అని పిలుచుకోవచ్చు.

మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచిండు. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఒకసారి మంత్రిగా కూడా పని చేసిండు. గులాబీ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ.. తను మాత్రమే మంత్రి అయ్యిండు అంటే మామూలు విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి సార్ తన కోడలు ప్రీతి రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండు. ఈ క్రమంలోనే ప్రీతి రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నారు. మీడియాలో కూడా ప్రముఖంగా దర్శనమిస్తున్నారు. ఈ లెక్కన ఇద్దరు కొడుకులు విద్యా వ్యాపారం.. పెద్ద కోడలు కూడా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఆయనకు రాజకీయ వారసురాలిగా ప్రీతి రెడ్డి ఉంటారు. ఈ మాట మేము అంటున్నది కాదు.. స్వయంగా మల్లారెడ్డి సరే చెబుతున్నాడు.

అన్నట్టు ఇన్ని ఆస్తులున్నప్పటికీ.. మల్లారెడ్డి సార్ 300 గజాల చిన్న ఇంట్లో ఉంటున్నాడు. అదే కాదు ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి కాపాడుకోవాలని చెబుతున్నాడు. ఎదుటివారిని చూసి ఈర్ష పడదని సూచిస్తున్నాడు. ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందంగా ఉంటామని ఆయన చెబుతున్నాడు. ఇటీవల కాలంలో వ్యక్తిత్వ పాఠాలను చెబుతున్నాడు మల్లారెడ్డి. అంతేకాదు టీవీ షోలలో కూడా కనిపిస్తున్నాడు. ఏడు పదుల వయసు దాటినా మల్లారెడ్డి ఇప్పటికీ ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపిస్తున్నాడంటే దానంతటికి కారణం ప్రశాంతతనే కావచ్చు. కానీ ఇంతటి ప్రశాంతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి మీద అప్పట్లో అంతగా ఎందుకు ఫైర్ అయ్యాడు.. ఐటీ అధికారులు దాడులు చేస్తే ఎందుకు బిపి తెచ్చుకున్నాడు.. ఇవి సమాధానం లేని ప్రశ్నలు.. మల్లారెడ్డి సమాధానం చెప్పలేని క్వశ్చన్లు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular