spot_img
Homeఅంతర్జాతీయంBangladesh Border Tensions: బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు.. చొరబాటుదారులను తరిమేస్తున్న ఈశాన్య రాష్ట్రాలు!

Bangladesh Border Tensions: బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు.. చొరబాటుదారులను తరిమేస్తున్న ఈశాన్య రాష్ట్రాలు!

Bangladesh Border Tensions: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థ మరింత బలపడింది. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది చొరబాటుదారులను అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా రావడానికి ప్రయత్నించేవారికి ఇబ్బందులు పెరిగాయి. సరిహద్దు వద్ద ఘర్షణలు, తరలింపు ప్రయత్నాలు, కంచె నిర్మాణం వంటి పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి.

సరిహద్దు ఘర్షణలు..
బెంగాల్‌ ప్రభుత్వం అక్రమంగా ఉంటున్న వారిని బంగ్లాదేశ్‌కు పంపించే పనిని వేగంగా చేస్తోంది. అయితే బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వారిని స్వీకరించడం లేదు. దీంతో సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్‌తో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 20కి పైగా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు కొత్తగా వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కొందరు సరిహద్దు వద్ద కొన్ని రోజులు ఉండి, రాత్రిపూట రహస్యంగా బంగ్లాదేశ్‌ వైపు వెళ్తున్నారు.

4 వేల కిలోమీటర్ల సరిహద్దు..
భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య 4 వేల కిలోమీటర్లకుపైగా సరిహద్దు ఉంది. పశ్చిమ బెంగాల్‌తోపాటు మేఘాలయ, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. వేలాది మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఈ సరిహద్దును కాపాడుతున్నారు. సిక్కిం, అస్సాం, మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధికారంలో ఉంది. మిజోరాం ప్రభుత్వం కూడా చొరబాట్లను వ్యతిరేకిస్తోంది. ఈ వాతావరణం చొరబాటుదారులకు ప్రతికూలంగా మారింది.

కంచె నిర్మాణంతో ఇబ్బందులు
భారత్‌ 569 కిలోమీటర్ల మేర సరిహద్దులో కంచె నిర్మించాలని అడుగులు వేస్తోంది. జీరో లైన్‌ వద్ద ఉన్న గ్రామాల్లో ఇళ్లు భారత్‌లో, పొలాలు బంగ్లాదేశ్‌లో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు కంచెను జీరో లైన్‌ వద్దే నిర్మించాలని కోరుతున్నారు. అయితే బంగ్లాదేశ్‌ దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ నెమ్మదిగా కంచె పనులు ముందుకు సాగుతున్నాయి.

బంగ్లాదేశ్‌ నేతల ఆవేశం..
బంగ్లాదేశ్‌లోని కొందరు రాజకీయ నాయకులు భారత్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఐఎస్‌ఐతో చేతులు కలిపామని, సిలిగుడి కారిడార్‌ను ఆక్రమిస్తామని ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.భారత వ్యతిరేక ఉన్మాదులను నియంత్రించడం బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి కష్టంగా మారుతోంది. రాత్రిపూట సరిహద్దు వైపు రావడాన్ని బంగ్లాదేశీయులు కూడా వ్యతిరేకిస్తున్నారు.

ఈ మొత్తం పరిణామాల వల్ల చొరబాటుదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భారత్‌లోకి వచ్చినట్లయితే ఎదురయ్యే పరిస్థితుల గురించి వారిలో భయం నెలకొంది. బెంగాల్‌తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల సహకారం ఈ తగ్గుదలకు కారణమవుతోంది. మొత్తంమీద సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారత్‌ వేగంగా చర్యలు తీసుకుంటోంది. అయితే బంగ్లాదేశ్‌ వైపు నుంచి వచ్చే రాజకీయ, భద్రతా సవాళ్లను ఎదుర్కోవడం కొనసాగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version