Site icon OkTelugu

Former Pok PM Anwarul Haq: భారత్‌లో దాడులు మా పనే.. మాజీ పీవోకే ప్రధాని సంచలన ప్రకటన..!

Former Pok PM Anwarul Haq

Former Pok PM Anwarul Haq

Former Pok PM Anwarul Haq: ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో యాత్రీకులపై ఉగ్రవాదులు దాడిచేశారు. 26 మందిని కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఇక నవంబర్‌ 10న ఢిల్లీలో పేలుడు జరిగింది. దీనిని ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్రవేట కూడా కొనసాగుతోంది. తాజాగా ఈ రెండు ఘటనలపై పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) మాజీ ప్రధాన మంత్రి అన్వర్‌ ఉల్‌ హక్‌ సంచలన ప్రకటన చేశారు. ఇవి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

దాడులు చేశామని అంగీకారం..
అన్వర్‌ ఉల్‌ హక్‌ 17 నవంబర్‌ వరకు ప్రధానమంత్రిగా కొనసాగించారు. పదవీ కాలం ముగిసే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట బాంబు పేలుళ్లు మరియు పహల్గాం ప్రాంతంలో జరిగిన కాల్పులకు పాకిస్తాన్‌ చెందిన ఉగ్రవాదులు సంబంధం ఉందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని పీవోకే అసెంబ్లీలో సభకు వెల్లడించడం విశేషం. ఆయన ప్రకారం, ఈ ఉగ్రవాద చర్యలతో భారతదేశం మీద తాము జిహాద్‌ అనుభవం తీస్తున్నామని కూడా పేర్కొన్నారు.

బలూచిస్తాన్‌కు మద్దతు ఇస్తుందని ఆరోపణ..
భారతదేశం బలూచిస్తాన్‌కు మద్దతు ఇస్తుంది అంటే, పాకిస్తాన్‌ కూడా భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని హక్‌ చెప్పారు. కానీ బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమం సత్వరంలో స్వతంత్రం పొందగలదని, అది సాధ్యం అవుతుంటే భారతదేశం ఇప్పటికే మద్దతు ఇస్తోందని హక్‌ అభిప్రాయం తెలిపారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం దీన్ని అంగీకరించకపోయినా, అన్వర్‌ ఉల్‌ హక్‌ సబబైన సమాచారాన్ని అందజేశారు.

వారం రోజుల్లో స్వాతంత్రం..
బలూచిస్తాన్‌కు ఇంత వరకు భారత్‌ నేరుగా మద్దతు ఇవ్వలేదు. అదే జరిగితే పాకిస్తాన్‌ భూభాగంలో 49 శాతం ఉన్న బలూచిస్తాన్‌ కేవలం వారం రోజుల్లోనే స్వాతంత్య్రం పొందుతుంది. అప్పుడు పాకిస్తాన్‌ ముఖచిత్రం మారిపోతుంది. ఈ విషయం పాకిస్తాన్‌ గుర్తుంచుకోవాలి. భవిష్యత్‌లో జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బలూచ్‌ ఆర్మీ భారత మద్దతు కోరుతోంది. కానీ భారత్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది.

పీవోకే భవిష్యత్‌ వ్యూహాలు
పీవోకే ప్రధాని ప్రకటన నేపథ్యంలో భారత ప్రభుత్వానికి పీవోకే విషయంలో వ్యూహాత్మక పునరాలోచన అవసరం ఉందని భావిస్తున్నారు. పీవోకేను భారత దేశంలో విలీనం చేసుకునే సమయంలో, ఆ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా మొదట గుర్తించి, ఆ తర్వాత భద్రతా చర్యలు తీసుకుని, ఆర్టికల్‌ 370 విధానాన్ని అమలు చేసి, తిరుగుబాటుదారులను పూర్తిగా ముగించాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి వ్యతిరేకమైన ఉగ్రవాద చర్యలకు పునఃరూపకల్పన చేసుకునే అవకాశం ఉన్నందున, జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆధారపడింది.

Exit mobile version