పండ్లు తినాలని ఉందా? కానీ షుగర్ ఆపేస్తుందా? డోన్ట్ వర్రీ

మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలి అనుకునేవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చక్కెర తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి అనుకుంటారు.

Image Credit : pexels

Image Credit : pexels

అయితే పండ్లు తినాలంటే చాలా మంది భయపడుతుంటారు. వీటి వల్ల షుగర్ వ్యాధి మరింత పెరుగుతుంది అని నమ్ముతారు.  

Image Credit : pexels

ఎలాంటి టెన్షన్ లేకుండా కొన్ని పండ్లను మీరు ఇష్టంగా తినవచ్చు. మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా వాటి పోషక ప్రయోజనాలను అందించడానికి మీకోసం ఉన్న ఆ పండ్లు ఏంటో చూసేద్దాం.

Image Credit : pexels

అవకాడో.. అవకాడోలు చక్కెర స్థానం చాలా తక్కువ. ఒక అవకాడోలో 1 గ్రాము కంటే తక్కువ చక్కెర ఉంటుంది. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, వివిధ అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి

Image Credit : pexels

కివి.. కివి ఒక ఉష్ణమండల పండు, ఇందులో 6 గ్రాముల చక్కెరను కలిగి ఉంటుంది

Image Credit : pexels

పీచెస్ : ఇది ఒక స్వీట్ ఫ్రూట్. కానీ ఇందులో తక్కువ చక్కెర ఉంటుంది. మీడియం-సైజ్ ఫ్రూట్ కు 13 గ్రాముల చక్కెర ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ, సి, పొటాషియం, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి.

Image Credit : pexels

బ్లాక్ ద్రాక్ష :  ద్రాక్షపండులో సుమారు 8-9 గ్రాముల చక్కెర ఉంటుంది. గ్రేప్స్ లో విటమిన్లు ఎ, సి, అలాగే ఫైబర్ లు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Image Credit : pexels

బోప్పాయి : ఒక కప్పు ముక్కలు చేసిన బొప్పాయిలో దాదాపు 8 గ్రాముల చక్కెర ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది.

Image Credit : pexels

బెర్రీలు : ఇతర పండ్లతో పోలిస్తే బెర్రీలలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలో దాదాపు 7 గ్రాముల చక్కెర ఉంటుంది. అయితే రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ ఒక కప్పుకు 5-7 గ్రాముల చక్కెరను కలిగి ఉంటాయి.