మనలో చాలా మంది తిన్న తర్వాత వెంటనే బెడ్ ఎక్కుతారు. కానీ ఇలా చేయడం అసలు మంచిది కాదు.
Image Credit : google
ఏ సమయంలో అయినా సరే తిన్న తర్వాత కాసేపు నడవాలి. ఓ రెండు అడుగులు నడిస్తే తప్పు లేదు కదా. మరి తిన్న తర్వాత నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Image Credit : google
తిన్న తర్వాత నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండెల్లో మంట, మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.
Image Credit : google
ముధుమేహంతో బాధపడుతున్నవారు భోజనం చేసిన తర్వాత నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
Image Credit : google
తిన్న తర్వాత నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో బరువు కూడా తగ్గవచ్చు.
Image Credit : google
మానసిక ఆరోగ్యం, గుండె ఆరోగ్యం బాగుంటుంది. కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
Image Credit : google
డిన్నర్ తర్వాత నడవడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. అయితే ఈ నడక వేగంగా ఉండకూడదు. నిదానమే ప్రదానం.
Image Credit : google
మరీ గంటలు గంటలు కూడా నడవాల్సిన అవసరం లేదు. తిన్న తర్వాత 30 ని. లు నడిస్తే చాలు అంటున్నారు నిపుణులు.
Image Credit : google